Don't Miss!
- News తెర మీదకు వివేకానందరెడ్డి రెండో భార్య..వీడియో వైరల్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
బాలా 'అర్జున్ రెడ్డి' రీమేక్.. మొత్తానికి ఇలా రిలీజ్ అవుతోంది!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి అన్ని సినిమా ఇండస్ట్రీలను కదిలించిందనే చెప్పాలి. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్ హిందీలో కూడా ఆ సినిమా రీమేక్ అయ్యింది. సినిమా సక్సెస్ అయ్యింది అనగానే రీమేక్ రైట్స్ కొనడానికి చాలా మంది ఎగబడ్డారు. ఇక మొదట ఈ సినిమాపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించింది మాత్రం కోలీవుడ్ హీరో విక్రమ్ అనే చెప్పాలి. కొడుకు ధృవ్ వెండితెర ఎంట్రీకి ఇదే సరైన కథ అని భారీ ధరకు కొనుగోలు చేసిన విక్రమ్ చాలా ఫాస్ట్ గా సెట్స్ పైకి తెచ్చాడు.
ఆదిత్య వర్మగా రూపొందిన ఆ కాన్సెప్ట్ అక్కడ కూడా మంచి వసూళ్లను అందుకొని ధృవ్ కి మంచి బూస్ట్ ఇచ్చింది. సందీప్ వంగా శిష్యుడు గిరిషయ ఆ సినిమాను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ వెర్షన్ కంటే ముందే సీనియర్ దర్శకుడు బాలా చేత ఒక వెర్షన్ ని డైరెక్ట్ చేశారు. కానీ ఆ సినిమా కొంచెం కూడా బాగా లేదని పక్కనపెట్టేశారు. అయితే ఇపుడు ఆ వెర్షన్ ని ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో విడుదల చేయబోతున్నారు.
ధ్రువ్ విక్రమ్, మేఘా చౌదరి నటించిన ఆ సినిమా అక్టోబర్ 6న సింప్లీ సౌత్ అనే OTT ప్లాట్ఫాంపై ప్రసారం కానుంది. సింప్లీ సౌత్ యొక్క అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా చిత్రం విడుదల వివరాలను ప్రకటించింది. ఇక విక్రమ్ తో శివ పుత్రుడు లాంటి సినిమా చేసి అతని కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చిన దర్శకుడు బాలా ధృవ్ కి కూడా అలాంటి హిట్టివ్వాలని అనుకున్నాడు. కానీ ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఇక ఆ సినిమా తరువాత బాల చాలా వరకు సైలెంట్ అయ్యారనే చెప్పాలి. గతంలో మాదిరిగా ఆయన స్టైల్ లో సినిమాలు రావడం లేదు.