Don't Miss!
- News ఏపీలో కేజీఎఫ్ 3 గురించి చెప్పిన చంద్రబాబు
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
హీరోగా మారుతున్న స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్
సౌతిండియా స్టార్ డైరెక్టర్లలో ఒకరైన గౌతమ్ మీనన్ త్వరలో హీరోగా అవతారం ఎత్తబోతున్నాడు. హీరోగా అంటే రొమాంటిక్ సీన్లు, యాక్షన్ సీన్లు ఉండక పోవచ్చు కానీ... ఆయన ప్రధాన పాత్రలో ఓ సినిమా రాబోతోంది.
జై అనే కొత్త దర్శకుడు ఓ స్క్రిప్టుతో ఇటీవల గౌతమ్ మీనన్ను సంప్రదించాడని, కథ నచ్చడంతో ఆ సినిమాలో ప్రధాన పాత్రలో నటించడానికి ఓకే చెప్పాడని సమాచారం. ఈ చిత్రంలో ఇవానా అనే ఓ అమ్మాయి ఫిమేల్ లీడ్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆయన రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న తమిళ చిత్రం 'ఎనై నూకి పాయుమ్ తోట'. సెప్టెంబర్ 27న ఈ చిత్రం విడుదల కాబోతోంది.
దీంతో పాటు విక్రమ్ ప్రధాన పాత్రలో 'ధృవ నక్షత్రం' అనే మరో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం ఇంకా షూటింగ్ దశలో ఉంది. ఈ ఏడాది డిసెంబర్లో సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.