Don't Miss!
- News రూ.100 తో ఊరు వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
హీరోగా మారుతున్న స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్
సౌతిండియా స్టార్ డైరెక్టర్లలో ఒకరైన గౌతమ్ మీనన్ త్వరలో హీరోగా అవతారం ఎత్తబోతున్నాడు. హీరోగా అంటే రొమాంటిక్ సీన్లు, యాక్షన్ సీన్లు ఉండక పోవచ్చు కానీ... ఆయన ప్రధాన పాత్రలో ఓ సినిమా రాబోతోంది.
జై అనే కొత్త దర్శకుడు ఓ స్క్రిప్టుతో ఇటీవల గౌతమ్ మీనన్ను సంప్రదించాడని, కథ నచ్చడంతో ఆ సినిమాలో ప్రధాన పాత్రలో నటించడానికి ఓకే చెప్పాడని సమాచారం. ఈ చిత్రంలో ఇవానా అనే ఓ అమ్మాయి ఫిమేల్ లీడ్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆయన రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న తమిళ చిత్రం 'ఎనై నూకి పాయుమ్ తోట'. సెప్టెంబర్ 27న ఈ చిత్రం విడుదల కాబోతోంది.
దీంతో పాటు విక్రమ్ ప్రధాన పాత్రలో 'ధృవ నక్షత్రం' అనే మరో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం ఇంకా షూటింగ్ దశలో ఉంది. ఈ ఏడాది డిసెంబర్లో సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.