twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వీళ్ళంతా డీవీడీ ...డైరక్టర్లే

    By Staff
    |

    Balu Mahendra
    ఇప్పటి తరంలో అంతా డీవీడీ డైరక్టర్లే. పుస్తకాలు చదివే అలావాటు పోయింది అంటూ ప్రముఖ దర్శకుడు,ఛాయాగ్రాహకుడు బాలూ మహేంధ్ర ఆవేదన చెందారు. పూ చిత్ర ఆడియో ఫంక్షన్ లో ఆయన మాట్లాడుతూ తాను తీసిన సినిమాలన్నీ సాహిత్యం నుంచి పుట్టినవే గానీ సినిమాలు చూసి సినిమాలు చెయ్యలేదని అన్నారు. పుస్తకాలు చదివేటప్పుడు మనలో సృజనాత్మకత పెర్గుతుందని,చదువుతున్న విషయాన్ని మన ఊహలకు తగ్గట్టు విజువలైజ్ చేసుకుంటామని ఆ అలవాటే స్క్రిప్టు ని సినిమా గా చేసేటప్పుడు ఉపయోగపడుతుందని అన్నారు.

    అందుకే తాను తన తగ్గర చేసే అసెస్టెంట్స్ ని రోజుకో షార్ట్ స్టోరీ చదివి సినాప్సిస్ రాయమనేవాడనని గుర్తు చేసుకున్నారు. ఇక తాను ప్రస్తుతం ఓ ప్రెవేట్ ఛానెల్ వారికి 'Kathai Neram' పేరుతో ఓ సీరియల్ చేద్దామనుకున్నాని అది తమళ సెల్వం రాసిన 'Veyyilodu Poi' షార్ట్ స్టోరీ అని ఆయన్ని రైట్స్ కోసం సంప్రదించానన్నారు. అయితే అప్పటికే ఆ కథని ఈ పూ దర్శకుడు శశి తీసుకుని ఈ సినిమా చేసాడని...తనకి చాలా సంతోషమనిపించిందన్నారు. ఇక ఈ పూ సినిమాని మోసర్ బీర్ సంస్ధ వారు నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ,పార్వతి నటించిన ఈ చిత్రం సంగీతాన్ని ఎస్.ఎస్.కుమరన్ అందించారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X