Don't Miss!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
'వేంగై పులి'గా గోపీచంద్ చిత్రం
తమిళ నిర్మాత మాట్లాడుతూ..... అన్ని సినిమాల్లోలాగే ఇందులోనూ హీరో, హీరోయిన్ ని ప్రేమిస్తాడు. అందుకు ఆమె అంగీకరించదు. ప్రేమించకపోతే ప్రాణం తీసుకుంటానని హీరో చెబుతాడు. అందుకు ఆమె 'నువ్వు ప్రాణం తీసుకోనక్కర్లేదు.. నేను చెప్పే ముగ్గరి ప్రాణాలు తీయ్..' అంటుంది. ఆ ముగ్గరు ఎవరు? ఎందుకు చంపాల్సి వచ్చిందన్నదే కథాంశమని పేర్కొన్నారు. 'గిల్లి', 'పయ్యా' స్థాయిలో ఇందులో కూడా పోరాట సన్నివేశాలు నిండుగా ఉన్నాయని తెలిపారు.
తెలుగులో ఈ చిత్రాన్ని గతంలో గోపీచంద్ తో శౌర్యం చిత్రం నిర్మించిన భవ్య క్రియేషన్స్ వారు నిర్మించారు . అయితే భాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం వర్కవుట్ కాలేదు. ఈ టైటిల్ విషయమై భవ్య క్రియేషన్స్ అధినేత ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ...హీరోకి హీరోయిన్ వాండెట్. విలన్ కి హీరో వాంటెడ్. కాబట్టే స్క్రిప్టు ప్రకారం ఈ టైటిల్ యాప్ట్ అని తలిచాం అన్నారు ఇక దర్శకుడు బి.వియస్ రవి గతంలో కళ్యాణ రామ్ జయీభవ, విష్ణు వర్దన్ సలీం, ఝమ్మంది నాదం వంటి చిత్రాలకి కథ, మాటలు అందించారు. దీక్షాసేథ్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అన్నె రవి, కూర్పు: శంకర్, ఛాయాగ్రహణం: రసూల్ ఎల్లోర్, నిర్మాత: వెనిగళ్ల ఆనందప్రసాద్.