Don't Miss!
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
కరోనా వేళ సంతోషకరమైన వార్త.. తండ్రిగా సంగీత దర్శకుడికి ప్రమోషన్
ఓ వైపు సంగీతంతో యువతను ఉర్రూతలూగించడమే కాదు.. నటుడిగానూ విమర్శల ప్రశంసలు అందుకుంటున్నాడు జీవీ ప్రకాశ్. డార్లింగ్ వంటి సూపర్ హిట్ ఆల్బమ్ అందించిన జీవీ ప్రకాశ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే తెలుగు, తమిళంలో మంచి ఆల్బమ్స్ అందించిన జీవీ.. కోలీవుడ్లో హీరోగానూ తన టాలెంట్ను చూపిస్తున్నాడు.
కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్లో నటిస్తూ మంచి యాక్టర్ అని నిరూపించుకున్నాడు. అలాంటి జీవీ ప్రకాశ్కు తండ్రిగా ప్రమోషన్ లభించింది. ఈ మేరకు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ కథేంటో ఓ సారి చూద్దాం.
జీవీ ప్రకాష్.. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్కు మేనల్లుడు అన్న సంగతి తెలిసిందే. ఆయన 2013లో తన చిన్ననాటి స్నేహితురాలైన.. గాయని సైంధవిని వివాహం చేసుకున్నాడు. తాజాగాఈ దంపతులకు పండంటి బిడ్డ జన్మించింది. సోమవారం (ఏప్రిల్ 20) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
ఈ శుభ వార్తతో వారి కుటుంబంలో ఆనందం నెలకొంది. పలువురు ప్రముఖులు జీవీ ప్రకాష్, సైంధవి దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జీవీ ప్రకాష్.. ప్రస్తుతం సూరారై పోట్రూ (ఆకాశం నీ హద్దురా) చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మధ్య హీరోగా వచ్చిన 100 పర్సెంట్ కాదల్ (100 పర్సెంట్ లవ్ రీమేక్), సర్వంతాళమయం సినిమాలు నటుడిగా మంచి గుర్తింపును తెచ్చాయి.