Don't Miss!
- Finance Stock Market: భారీ లాభాల్లో విహరిస్తున్న సెన్సెక్స్-నిఫ్టీ.. అంతా బుల్స్ హవాతోనే..
- News టీడీపీ ఆశలపై "స్వామిజీ" నీళ్లు - మారుతున్న లెక్కలు..!!
- Sports SRH vs MI: ఆ దిగ్గజ క్రికెటర్ వల్లనే చరిత్ర సృష్టించా- అభిషేక్ శర్మ
- Automobiles ఫ్రీ బస్సులో వాటికి ప్రత్యేకంగా సీటు.. బామ్మ, మనవరాలికి షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Lifestyle Car Vastu Tips: కారు ఉందా అయితే ఈ వాస్తు నియమాలు పాటించండి..ఈ డైరెక్షన్ లో పార్క్ చేస్తే
- Technology Poco నుంచి F సిరీస్ లో కొత్త ఫోన్! స్పెసిఫికేషన్లు లీక్, వివరాలు
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
కరోనా వేళ సంతోషకరమైన వార్త.. తండ్రిగా సంగీత దర్శకుడికి ప్రమోషన్
ఓ వైపు సంగీతంతో యువతను ఉర్రూతలూగించడమే కాదు.. నటుడిగానూ విమర్శల ప్రశంసలు అందుకుంటున్నాడు జీవీ ప్రకాశ్. డార్లింగ్ వంటి సూపర్ హిట్ ఆల్బమ్ అందించిన జీవీ ప్రకాశ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే తెలుగు, తమిళంలో మంచి ఆల్బమ్స్ అందించిన జీవీ.. కోలీవుడ్లో హీరోగానూ తన టాలెంట్ను చూపిస్తున్నాడు.
కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్లో నటిస్తూ మంచి యాక్టర్ అని నిరూపించుకున్నాడు. అలాంటి జీవీ ప్రకాశ్కు తండ్రిగా ప్రమోషన్ లభించింది. ఈ మేరకు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ కథేంటో ఓ సారి చూద్దాం.
జీవీ ప్రకాష్.. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్కు మేనల్లుడు అన్న సంగతి తెలిసిందే. ఆయన 2013లో తన చిన్ననాటి స్నేహితురాలైన.. గాయని సైంధవిని వివాహం చేసుకున్నాడు. తాజాగాఈ దంపతులకు పండంటి బిడ్డ జన్మించింది. సోమవారం (ఏప్రిల్ 20) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
ఈ శుభ వార్తతో వారి కుటుంబంలో ఆనందం నెలకొంది. పలువురు ప్రముఖులు జీవీ ప్రకాష్, సైంధవి దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జీవీ ప్రకాష్.. ప్రస్తుతం సూరారై పోట్రూ (ఆకాశం నీ హద్దురా) చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మధ్య హీరోగా వచ్చిన 100 పర్సెంట్ కాదల్ (100 పర్సెంట్ లవ్ రీమేక్), సర్వంతాళమయం సినిమాలు నటుడిగా మంచి గుర్తింపును తెచ్చాయి.