Don't Miss!
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
హన్సికకు తృటిలో తప్పిన పెను ప్రమాదం
ధనుష్, హన్సిక జంటగా 'మాపిళ్లై' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల తిరునల్వేలోని ఓ మారుమూల గ్రామంలో జరిగింది. ధనుష్, హన్సిక కాంబినేషన్లో ఓ పాట చిత్రీకరిస్తున్నారు. ఆ షూటింగ్ కోసం ఆరు ట్రాక్టర్లను వాడుతున్నారు. సమయంలో అనుకోకుండా ట్రాక్టర్ ఆ లొకేషన్లోకి దూసుకొచ్చింది. నలుగురు వ్యక్తులను గాయపరిచి హన్సిక వైపుకు దూసుకు వస్తున్న ఆ ట్రాక్టర్ను ధనుష్ గమనించి వెంటనే ఆమెను ప్రక్కకు తోసేయటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ హఠాత్పరిణామానికి షాక్ అయిన హన్సిక భయంతో ఏడవటం మొదలుపెట్టింది. షాక్ నుంచి ముందుగా కోలకున్న యూనిట్ సభ్యులు ఆమెను సముదాయించడంతో కాసేపటికి ఆమె తేరుకుంది. ఈ ప్రమాదం కారణంగా కొన్ని గంటల పాటు షూటింగ్ను రద్దు చేయాల్సి వచ్చింది. ఇక ఈ చిత్రం రజనీకాంత్, అమల జంటగా నటించిన 'మాపిళ్లై' చిత్రానికి రీమేక్. ఆ చిత్రంలో రజనీకి అత్తగా శ్రీవిద్య నటించారు. తాజా చిత్రంలో మనీషా కొయిరాలా అత్త పాత్ర పోషిస్తున్నారు. కొంత గ్యాప్ తర్వాత మనీషా నటిస్తున్న చిత్రం ఇది.