Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఫ్యాన్స్ కళ్ళు గప్పి థియోటర్ లోనికి ఎంటరైన హన్సిక ఏంజరిగింది..!?
బబ్లీ గాళ్ హన్సిక ప్రస్తుతం తెలుగులో రామ్ సరసన 'కందిరీగ", సిద్దార్థ్తో 'ఓ మై ఫ్రెండ్" చిత్రాలు కమిట్ అయిన విషయం విదితమే. మరోవైపు తమిళంలో ఏకంగా మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే చిన్న ఖుష్బూ అని తమిళీయులు హన్సికపై అభిమానం కనబరుస్తున్నారు. 'మాప్పిళ్లయ్" తర్వాత తమిళ ప్రేక్షకులకు ఇంకా చేరువ అవుతానని హన్సిక అంటున్నారు. ప్రస్తుతం 'వేలాయుధం, ఒరు కాల్ ఒరు కన్నాడి" చిత్రాల్లో నటిస్తున్నారామె.
కాగా ప్రేక్షకుల స్పందనను నేరుగా తెలుసుకోవాలని అనిపించిందట. లక్కీగా చెన్నైలోని 'సత్యం" థియేటర్లో ఆమె నటిస్తున్న 'ఒరు కాల్ కన్నాడి" షూటింగ్ జరిగింది. అదే థియేటర్లోనే 'ఎంగేయుమ్ కాదల్" ఆడటంతో వీలు చూసుకుని హన్సిక సైలెంట్ గా థియేటర్లో సెటిలయ్యారట. కానీ ప్రేక్షకులు ఈ బ్యూటీని గుర్తుపట్టేసి చుట్టు ముట్టేశారట. ఆ విషయం గురించి హన్సిక చెబుతూ 'ప్రేక్షకులు నాతో ఎంతో అభిమానంగా మాట్లాడారు అన్నారు. ముంబాయ్ లో పుట్టి పెరిగిన నాకు ఊరు కానీ ఊరులో ఇంత అభిమానం లభించడం ఉద్వేగానికి గురిచేసింది. ఆనందభాష్పాలతో నా కళ్లు నిండిపోయాయి, ఈ స్థాయిలో స్పందన వస్తుందని ఊహించలేదు. అందుకే షాక్ అయ్యాను అన్నారు.