Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'యముడు' సీక్వెల్ లో హన్సిక పాత్ర ఏమిటంటే...
చెన్నై: సూర్య, అనుష్క కాంబినేషన్ లో రూపొంది ఘన విజయం సాధించిన చిత్రం 'సింగమ్'(తెలుగులో యముడు). ఇప్పుడీ చిత్రం సీక్వెల్ రెడీ అవుతోంది. ఇందులో హన్సిక హీరోయిన్ చేస్తోంది. ఈ చిత్రంలో హన్సిక స్కూల్ విద్యార్థినిగా కొన్ని సన్నివేశాల్లో కనిపిస్తుంది. ఇటీవలే వాటిని చిత్రించారు. ఈ ముద్దుగుమ్మ సూర్యతో కలిసి నటించటం పట్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తోంది. అలాగే చిత్రం మెగా హిట్ అవుతోందని ఆమె చెప్తోంది. అయితే చిత్రంలో ఆమె పాత్ర కేవలం పదిహేను నిముషాలు మాత్రమే ఉంటోందని తెలుస్తోంది. అనుష్క మెయిన్ హీరోయిన్.
హన్సిక మాట్లాడుతూ ''చిన్నప్పుడు తరగతి గదిలో గడిపిన క్షణాలు గుర్తుకొస్తున్నాయి. మళ్లీ యూనిఫామ్ వేసుకొని స్కూల్కెళ్లి చదువుకొంటే ఎంత బాగుంటుందో కదూ. స్కూల్ పిల్లలతో కలిసి తరగతిలో కూర్చొంటే భలే తమాషాగా అనిపించింది. పాఠశాల రోజులు గుర్తుకొస్తున్నాయ''ని చెప్పింది. ఇంకో విషయమేమిటంటే... హన్సిక నిర్మాతగా మారబోతోందట. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు తీయడం నా లక్ష్యం అంటోంది. ''ఎప్పట్నుంచో కంటున్న కల ఇది. తొందరలో సాకారమవుతుంద''ని చెప్పింది.
తెలుగు, తమిళ భాషల్లో విజయవంతమైన చిత్రం 'యముడు'. అనుష్క,సూర్య కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రానికి హరి దర్సకత్వం వహించారు. తమిళంలో సింగం టైటిల్ తో వచ్చిన ఈ చిత్రం హిందీలోకి సైతం రీమేక్ అయ్యింది. అజయ్ దేవగన్,కాజల్ కాంబినేషన్ లో అక్కడ కూడా చిత్రం బాగానే వర్కవుట్ అయ్యింది. తొలి భాగం రూపొందించిన హరికే దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. అలాగే సంగీతం ను దేవిశ్రీప్రసాద్ సమకూరుస్తారు. అలా మొదటి చిత్రానికి పనిచేసిన టీమ్ మొత్తం ఈ 'యముడు 2'కి పనిచేయటానికి రెడీ అవుతున్నారు.
ఈ చిత్రంలో అనుష్క, వివేక్, సంతానం కీ రోల్స్ లో చేస్తున్నారు. ప్రియన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. సూర్య కూడా సెవెంత్ సెన్స్ చిత్రం ఊహించిన విధంగా వర్కవుట్ కాకపోవటంతో మరో కమర్షియల్ సక్సెస్ తో ప్రేక్షకులను అలరించాలనుకుంటున్నారు. దానికి సీక్వెల్ సరైన మార్గం అని ఫిక్సయ్యాడని తమిళ పత్రికలు అంటున్నాయి. అందులోనూ హన్సికకు అక్కడ మంచి మార్కెట్ ఉంది. ఆమెకు తెలుగులో ఆఫర్స్ లేవు. దాంతో ఆమె దృష్టి ఇప్పుడు తమిళంలో నెంబర్ వన్ స్టేజికి వెళ్లాలనే ఉంది.