Don't Miss!
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- News తెలంగాణ జెన్కో, ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
- Sports Tilak Varma:అతని కోసమే ఆ సంబరాలు! వీడియో
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఏ మతాన్ని కించపరచే సీన్స్ లేవు
చెన్నై: ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న చిత్రం 'మెసెంజర్ ఆఫ్ గాడ్'. గుర్మిత్రామ్ రహీం సింగ్ ఇందులో కీలకపాత్ర పోషించారు. సంగీతంతోపాటు దర్శకత్వం కూడా ఆయన వహించారు. సెన్సార్బోర్డులో అధికారుల రాజీనామాకు కూడా దారి తీసిన ఈ చిత్రం పలు సమస్యలను దాటుకుని విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ చిత్రంలో సిక్కులను కించపరుస్తూ.. కొన్ని సన్నివేశాలను తెరకెక్కించినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. దీంతో పంజాబ్, హర్యానాలో ఈ సినిమాను నిషేధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి. అంతేకాకుండా ఈ చిత్రాన్ని అడ్డుకోవాలని కోరుతూ కొన్ని వర్గాలు కోర్టుల్లో వ్యాజ్యం దాఖలు చేశాయి. చివరకు ఈ అంశం అత్యున్నత న్యాయస్థానానికి చేరింది.
గుర్మిత్రామ్ రహీంసింగ్ మాట్లాడుతూ.. ఇందులో చర్చనీయాంశమైన అంశాలేవీ లేవు. ప్రధానంగా యువతను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన చిత్రమిది. ఇందులో మతాలను కించపరిచేందుకు అవకాశాలు లేవు. ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఈ చిత్రాన్ని చూసింది.
కొన్ని సన్నివేశాలను తొలగించి విడుదలకు మార్గం సుగమం చేసింది. తొలగించిన సన్నివేశాల వల్ల మేం చెప్పదలచుకున్న విషయాన్ని ఎలాంటి ఆటంకం కలగలేదు. ప్రపంచవ్యాప్తంగా వీలైనంత త్వరలో ఈ సినిమా విడుదల చేయాలని అనుకుంటున్నానని చెప్పారు.