Don't Miss!
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఏ మతాన్ని కించపరచే సీన్స్ లేవు
చెన్నై: ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న చిత్రం 'మెసెంజర్ ఆఫ్ గాడ్'. గుర్మిత్రామ్ రహీం సింగ్ ఇందులో కీలకపాత్ర పోషించారు. సంగీతంతోపాటు దర్శకత్వం కూడా ఆయన వహించారు. సెన్సార్బోర్డులో అధికారుల రాజీనామాకు కూడా దారి తీసిన ఈ చిత్రం పలు సమస్యలను దాటుకుని విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ చిత్రంలో సిక్కులను కించపరుస్తూ.. కొన్ని సన్నివేశాలను తెరకెక్కించినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. దీంతో పంజాబ్, హర్యానాలో ఈ సినిమాను నిషేధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి. అంతేకాకుండా ఈ చిత్రాన్ని అడ్డుకోవాలని కోరుతూ కొన్ని వర్గాలు కోర్టుల్లో వ్యాజ్యం దాఖలు చేశాయి. చివరకు ఈ అంశం అత్యున్నత న్యాయస్థానానికి చేరింది.
గుర్మిత్రామ్ రహీంసింగ్ మాట్లాడుతూ.. ఇందులో చర్చనీయాంశమైన అంశాలేవీ లేవు. ప్రధానంగా యువతను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన చిత్రమిది. ఇందులో మతాలను కించపరిచేందుకు అవకాశాలు లేవు. ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఈ చిత్రాన్ని చూసింది.
కొన్ని సన్నివేశాలను తొలగించి విడుదలకు మార్గం సుగమం చేసింది. తొలగించిన సన్నివేశాల వల్ల మేం చెప్పదలచుకున్న విషయాన్ని ఎలాంటి ఆటంకం కలగలేదు. ప్రపంచవ్యాప్తంగా వీలైనంత త్వరలో ఈ సినిమా విడుదల చేయాలని అనుకుంటున్నానని చెప్పారు.