Don't Miss!
- News Lok Sabha Election 2024 Phase2 Polling LIVE: రెండో దశ పోలింగ్కు సర్వం సిద్ధం..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వాళ్లిద్దరూ హనీమూన్ నుంచి వస్తేగాని నా మాట వినరు.. విశాల్, ఆర్యపై హీరో కార్తి సెటైర్లు!
తమిళ హీరో కార్తీకి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆవారా, నా పేరు సూర్య, ఊపిరి చిత్రాలతో కార్తీకి మంచి మార్కెట్ ఏర్పడింది. కార్తీ చివరగా నటించిన చిత్రం చినబాబు. ఈ చిత్రం తమిళనాడులో కమర్షియల్ గా విజయం సాధించింది కానీ తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకోలేక పోయింది. ప్రస్తుతం కార్తీ నటిస్తున్న తాజా చిత్రం దేవ్. రాజత్ రవిశంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. స్టైలిష్ లవ్ స్టోరీగా ఈ చిత్రం రూపొందింది. కార్తీకి జోడిగా ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ నటిస్తుండడం విశేషం. ఫిబ్రవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండడంతో కార్తీ ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నాడు.
కొత్త దర్శకులతో చేయను
కార్తీ ఓ ఇంటర్వ్యూలో దేవ్ చిత్రం గురించి మాట్లాడుతూ.. నేను సాధారణంగా కొత్త దర్శకులతో సినిమా చేయడానికి ఇష్టపడను. ఎవరైనా నన్ను కలసి సూచిస్తే తప్ప కొత్త దర్శకులు వినిపించే కథలు వినను అని కార్తీ తెలిపాడు. నాకు నమ్మకం కలగాలంటే వాళ్ళు కనీసం ఒక్క చిత్రం అయినా తెరకెక్కించి ఉండాలి. కానీ దేవ్ కథ వినిగానే నాకు కొత్తగా అనిపించింది. అందుకే చేస్తున్నా అని కార్తీ తెలిపాడు.
నాలుగు పాత్రలు కీలకం
దేవ్ చిత్రంలోని నాలుగు పాత్రలు చాలా కీలకంగా ఉంటాయని సురేష్ బాబు తెలిపాడు. ఆ పాత్రలకు ప్రారంభం, ముగింపు చక్కగా ఉంటుంది. దేవ్ చిత్రం పూర్తిగా న్యూ ఏజ్ లవ్ స్టోరీ అని కార్తీ తెలిపాడు. తన పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయని కార్తీ తెలిపాడు. రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో స్వతంత్రంగా ఆలోచించే మహిళగా నటిస్తోంది.
హానీమూన్ నుంచి రానివ్వండి
తమిళ హీరోలు విశాల్ త్వరలో వివాహం చేసుకోబోతున్నాడు. మరోవైపు ఆర్య, సయేశా సైగల్ కూడా పెళ్ళికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విశాల్, ఆర్యకు మీరేమైనా సలహా ఇస్తారా అని అడగగా కార్తీ సరసగా సమాధానం ఇచ్చారు. విశాల్, ఆర్య ఇద్దరూ కార్తీకి మంచి స్నేహితులే. హనీమూన్ నుంచి తిరిగి వచ్చేవరకు నేనేం చెప్పినా వాళ్ళు వినరు. కాబట్టి ముందు వారిని హనీమూన్ పూర్తి చేసుకుని రానివ్వండి అని చమత్కరించారు.
హైదరాబాద్ అమ్మాయి
హీరో విశాల్ హైదరాబాద్ కు చెందిన అనిషా అనే యువతిని వివాహం చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని ఇటీవలే విశాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి కొన్ని నెలల్లోనే వీరిద్దరి వివాహం జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇక హీరో ఆర్య, సాయేషా సైగల్ ప్రేమ గురించి కూడా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి కుటుంబ సభ్యులు వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం.