Don't Miss!
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- News ఏపీలో 45 డిగ్రీలను దాటిన టెంపరేచర్: గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది ఇక్కడే
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
డైరెక్టర్ కోటి రూపాయల చీటింగ్.. హీరో కేసు.. హైకోర్టు ఝలక్!
తమిళ దర్శకుడు మిస్కిన్ మరోసారి వివాదంలో చిక్కుకొన్నాడు. ఓ సినిమాను పూర్తి చేయకుండానే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడంతో బాధిత నిర్మాత, హీరోలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దాంతో దర్శకుడు మిస్కిన్కు ఝలక్ ఇచ్చింది. దాంతో ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్తో చేయాల్సిన సినిమాను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివారాల్లోకి వెళితే..
సినిమా చేస్తానని చెప్పి మోసం
2015లో నిర్మాత రఘునందన్, అతడి కుమారుడు మైత్రేయతో సినిమా చేయడానికి ఒప్పందం కుదుర్చుకొన్నారు. ఆ తర్వాత రూ.1 కోటి తీసుకొని సినిమా స్టార్ చేయకుండా తమను మోసం చేశాడని నిర్మాత రఘునందన్ ఆరోపించారు. విశాల్తో తుప్పరివాలన్ సినిమా పూర్తి చేసిన తర్వాత తమతో సినిమా చేస్తానని చెప్పి ఒప్పందాన్ని ఉల్లంఘించాడని మండిపడ్డారు.
మిస్కిన్కు మద్రాస్ హైకోర్టు ఝలక్
మిస్కిన్ తమను మోసం చేశాడనే ఆరోపణలతో రఘునందన్, మైత్రేయ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదును స్వీకరించిన తర్వాత మిస్కిన్కు కోర్టు ఝలక్ ఇచ్చింది. ఒప్పందం పూర్తయ్యే వరకు మరో సినిమాను షూట్ చేయకూడదు లేదా రిలీజ్ చేయకూడదు అని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
విశాల్తో సినిమా తర్వాత
ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్తో సైకో అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తుప్పరివాలన్ తర్వాత మైత్రేయతో తీయాల్సిన స్క్రిప్టును వాడుకొని ఉదయనిధితో సినిమా ప్రారంభించాడని అభియోగాలు ఉన్నాయి. కోర్టు ఆదేశాలతో సైకో షూటింగ్ను నిలిపివేయాల్సి వచ్చింది.
కష్టాల్లో మిస్కిన్
తాజా మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో మిస్కిన్ కష్టాల్లో పడ్డాడు. ఉదయనిధి స్టాలిన్తో సినిమా వాయిదా పడటం కోలీవుడ్లో చర్చనీయాంశమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో విశాల్ మాకు సహకరిస్తానని, తమను కష్టాల నుంచి గట్టెక్కిస్తానని హామీ ఇచ్చాడని మైత్రేయ మీడియాకు వెల్లడించారు. సైకో చిత్రంలో అదితిరావు హైదరీ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.