Don't Miss!
- News ఉండి టీడీపీలో వార్ - మారుతున్న లెక్కలు, ఆడియో వైరల్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎంత వీలైత అంత చేయండి.. ఫ్యాన్స్కు హీరో విజ్ఞప్తి
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఎంతలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వైరస్ ధాటికి అగ్ర రాజ్యం కూడా అతలాకుతలమైపోతోంది. మన దేశంలోనూ రోజురోజుకూ పరిస్థితి దిగజారిపోతోంది. ఇప్పటికే రెండు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. వేల మంది మృత్యువాత పడ్డారు. అయితే కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం కాస్త ఉపశమనం కలిగించే విషయమే.
కరోనా లాంటి విపత్కర కాలంలో ప్రతీ ఒక్కరూ ఎన్నో బాధలు అనుభవించారు. ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. ఇంకెంతో మంది వలస కార్మికులు రోడ్డున పడ్డారు. అయితే వీరిని ఆదుకునేందుకు ఎంతో మంది ముందుకు వచ్చారు. సినీ తారలంతా ముందుకు వచ్చి వారికి చేతనైన సాయాన్ని చేశారు. ఈ క్రమంలో హీరో సూర్య తన అగరం ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టాడు.
సూర్య అభిమానులు సైతం ఎందరో పేదలకు అనేక విధాలుగా సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా సూర్య తన అభిమానులకు ఒక విజ్ఞప్తి చేశారు. ఇలాంటి కష్టకాలంలో అభిమానులు నిరంతరం సేవా కార్యక్రమాలు పాల్గొనడం సాధారణ విషయం కాదన్నారు. పేదలకు ఎంతవరకు సాయం చేయగలరో అంతవరకు చేయండని అన్నాడు. అయితే ఏ విధంగానూ తనకు బాధ కలిగించేవి చేయొద్దని పేర్కొన్నాడు.
అధేవిధంగా కొందరు ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నాడు. అలాంటివి సాధ్యమైనంత వరకు నిషేధించాలని చెప్పారు. నిరంతరం సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న తన అభిమానులను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు సూర్య పేర్కొన్నాడు.