Don't Miss!
- Sports వేరీజ్ `మ్యాడ్` మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
హీరో విశాల్ చిత్రాలపై బ్యాన్ పెట్టిన డిస్ట్రిబ్యూటర్స్
పందెం కోడి, ప్రేమ చదరంగం, భరణి, భయ్యా వంటి చిత్రాలతో తెలుగు,తమిళ భాషల్లో తనకంటూ ప్రేక్షకులను ఏర్పాటు చేసుకున్న నటుడు విశాల్. ప్రస్తుతం ఆయనకు తమిళంలో గడ్డుకాలం ఎదురైంది. ఆయన చిత్రాలను కొనుగోలు చేయరాదని డిస్ట్రిబ్యూటర్ల సంఘం తీర్మానం చేసింది. తమిళనాడు డిస్ట్రిబ్యూటర్ల సంఘం సంయుక్త సమావేశం చెన్నైలోని దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి ఆవరణలో జరిగింది. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడు బాలాజీ మాట్లాడుతూ విశాల్ సొంత నిర్మాణ సంస్థ జీకే కార్పొరేషన్ డిస్ట్రిబ్యూటర్లకు చాలా బాకీ చెల్లించాల్సి ఉం దన్నారు. ఈ విషయమై పలుమార్లు ఆ సంస్థ నిర్వాహకులతో సంప్రదించినాసరైన స్పందన రాలేదన్నారు. డిస్ట్రిబ్యూటర్లకు చెల్లించాల్సిన మొత్తాన్ని అందజేయలేదన్నారు. ఇకపై విశాల్ నటించే చిత్రాలను పంపిణీ చేయరాదని తీర్మానం చేశామని వెల్లడిం చారు. ఈ సమావేశంలో కార్యదర్శి జోసఫ్ ప్రాన్సిస్, సురేష్ తో పాటు పలు వురు డిస్టిబ్యూటర్లు పాల్గొన్నారు.ఇదిలా ఉంటే విశాల్ చిత్రాలు భాక్సాఫీస్ వద్ద వరసగా డిజాస్టర్ ఫలితాలను చవిచూస్తున్నాయి. అందుకే డిస్ట్రిబ్యూటర్స్ కి బాకీలు మిగిలాయని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం విశాల్..ప్రభుదేవా దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు.