Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కబ్జా, బెదిరింపు కేసు : హీరో మాధవన్కు కోర్టు నోటీసులు
చెన్నై: కబ్జా చేసి తనను బెదిరిస్తున్నారని హీరో మాధవన్ పై అరోపణలు వచ్చాయి. ఈ విషయమై గణేష్ అనే వ్యక్తి కోర్టుకు ఎక్కాడు. దాంతో ఈ కబ్జా కేసులో హీరో మాధవన్కు చెన్నై హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
పూర్త వివరాల్లోకి వెళితే....గత కొంత కాలంగా ఈ కేసు నలుగుతోంది. దిండుగల్ జిల్లా పళనీ సమీపంలోని పాలసముద్రం ప్రాంతానికి చెందిన గణేశ్ అనే వ్యక్తి హైకోర్టు మధురై శాఖలో ఓ పిటీషన్ దాఖలు చేశారు. అందులో మధురై జిల్లా పాలసముద్రంలో సాగుబడి కాలువ పక్కన ఉన్న రాజమ్మాళ్కు చెందిన 4.88 ఎకరాల భూమిని నటుడు మాదవన్ కోనుగోలు చేశారని పేర్కొన్నారు.
అయితే మాధవన్ సాగుబడి కాలువను కొంత భాగం ఆక్రమించి కొబ్బరి, జామ తోటలను నాటుతున్నారని ఆరోపించారు.ఆయన ఆక్రమించుకున్న ప్రాంతంలో విద్యుత్ స్తంభం కూడా ఉందన్నారు. దీని గురించి కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
దీనిపై విచారించిన విద్యుత్ శాఖ అధికారి ఆ సాగుబడి కాలువ ఉపయోగంలో లేదని తెల్చి చెప్పారన్నారు. అంతేకాకుండా మాధవన్ అనుచరులు తనపై బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించాడు. దీని గురించి నెయ్క్కారపట్టి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నాడు.
వర్షాకాలం ప్రారంభం కావడంతో ఈ గ్రామ ప్రజల జీవనాధారాన్ని కాపాడే విధంగా కాలువ దురాక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని ఆధికారులకు ఆదేశించాలని పిటిషన్లో కోరారు.
పిటీషన్ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తులు కేకే.చంద్రన్, పీ.గోకుల్నాథ్లు నటుడు మాధవన్, దిండుగళ్ కలెక్టర్, విద్యుత్ శాఖ అధికారి, పళనీ తహశీల్దార్లకునోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను జూలై 11కు వాయిదా వేశారు.
ఇక మాధవన్ తాజా చిత్రాల విషయానికి వస్తే... వరస ఫెయిల్యూర్స్ ఉన్న మాధవన్ ...'ఇరుదిసుట్రు'తో మళ్లీ ఫామ్లోకి వచ్చారు. దాంతో అదే ఊపులో మాధవన కోలీవుడ్ 'చార్లీ'గా మారబోతున్నాడు. మలయాళంలో ఘనవిజయం సాధించిన 'చార్లీ' చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసేందుకు లైకా ప్రొడక్షన్స్ సంస్థ సన్నాహాలు చేస్తోంది.
గతంలో ఎన్నో వైవిధ్య చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ఏఎల్ విజయ్ దర్శకత్వం ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. ఒరిజినల్ వెర్షనలో నటించిన పార్వతి తమిళంలోనూ హీరోయిన్గా నటించనుంది. షూటింగ్ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభమవుతుందని సమాచారం.
ప్రస్తుతం 'అభినేత్రి' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఏఎల్ విజయ్ 'చార్లీ' స్ర్కిప్టు పనులపైనా దృష్టి సారించారట. 'ఇరుదిసుట్రు'లో బాక్సింగ్ కోచ్గా మెప్పించిన మాధవన్ 'చార్లీ' రీమేక్ కోసం శరీరాకృతిని మార్చుకుంటున్నట్టు తెలుస్తోంది.