twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కబ్జా, బెదిరింపు కేసు : హీరో మాధవన్‌కు కోర్టు నోటీసులు

    By Srikanya
    |

    చెన్నై: కబ్జా చేసి తనను బెదిరిస్తున్నారని హీరో మాధవన్ పై అరోపణలు వచ్చాయి. ఈ విషయమై గణేష్ అనే వ్యక్తి కోర్టుకు ఎక్కాడు. దాంతో ఈ కబ్జా కేసులో హీరో మాధవన్‌కు చెన్నై హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

    పూర్త వివరాల్లోకి వెళితే....గత కొంత కాలంగా ఈ కేసు నలుగుతోంది. దిండుగల్ జిల్లా పళనీ సమీపంలోని పాలసముద్రం ప్రాంతానికి చెందిన గణేశ్ అనే వ్యక్తి హైకోర్టు మధురై శాఖలో ఓ పిటీషన్ దాఖలు చేశారు. అందులో మధురై జిల్లా పాలసముద్రంలో సాగుబడి కాలువ పక్కన ఉన్న రాజమ్మాళ్‌కు చెందిన 4.88 ఎకరాల భూమిని నటుడు మాదవన్ కోనుగోలు చేశారని పేర్కొన్నారు.

    అయితే మాధవన్ సాగుబడి కాలువను కొంత భాగం ఆక్రమించి కొబ్బరి, జామ తోటలను నాటుతున్నారని ఆరోపించారు.ఆయన ఆక్రమించుకున్న ప్రాంతంలో విద్యుత్ స్తంభం కూడా ఉందన్నారు. దీని గురించి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

    దీనిపై విచారించిన విద్యుత్ శాఖ అధికారి ఆ సాగుబడి కాలువ ఉపయోగంలో లేదని తెల్చి చెప్పారన్నారు. అంతేకాకుండా మాధవన్ అనుచరులు తనపై బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించాడు. దీని గురించి నెయ్‌క్కారపట్టి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నాడు.

    వర్షాకాలం ప్రారంభం కావడంతో ఈ గ్రామ ప్రజల జీవనాధారాన్ని కాపాడే విధంగా కాలువ దురాక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని ఆధికారులకు ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు.

    R Madhavan

    పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తులు కేకే.చంద్రన్, పీ.గోకుల్‌నాథ్‌లు నటుడు మాధవన్, దిండుగళ్ కలెక్టర్, విద్యుత్ శాఖ అధికారి, పళనీ తహశీల్దార్‌లకునోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను జూలై 11కు వాయిదా వేశారు.

    ఇక మాధవన్ తాజా చిత్రాల విషయానికి వస్తే... వరస ఫెయిల్యూర్స్ ఉన్న మాధవన్ ...'ఇరుదిసుట్రు'తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. దాంతో అదే ఊపులో మాధవన కోలీవుడ్‌ 'చార్లీ'గా మారబోతున్నాడు. మలయాళంలో ఘనవిజయం సాధించిన 'చార్లీ' చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేసేందుకు లైకా ప్రొడక్షన్స్ సంస్థ సన్నాహాలు చేస్తోంది.

    గతంలో ఎన్నో వైవిధ్య చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వం ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. ఒరిజినల్‌ వెర్షనలో నటించిన పార్వతి తమిళంలోనూ హీరోయిన్‌గా నటించనుంది. షూటింగ్‌ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభమవుతుందని సమాచారం.

    ప్రస్తుతం 'అభినేత్రి' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఏఎల్‌ విజయ్‌ 'చార్లీ' స్ర్కిప్టు పనులపైనా దృష్టి సారించారట. 'ఇరుదిసుట్రు'లో బాక్సింగ్‌ కోచ్‌గా మెప్పించిన మాధవన్ 'చార్లీ' రీమేక్‌ కోసం శరీరాకృతిని మార్చుకుంటున్నట్టు తెలుస్తోంది.

    English summary
    The Madras High Court has issued notice to Tamil film actor R Madhavan on a PIL accusing him of encroaching upon a water channel adjacent to land purchased by him in Dindigul district.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X