Don't Miss!
- News జగన్కు షాక్..పిఠాపురంలో వైసీపీకి భారీగా రాజీనామాలు
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'బాషా' రీమేక్ చేయటం లేదంటూ ఖండన
తమిళంలో రజనీకాంత్ నటించిన 'బాషా'అప్పట్లో పెద్ద సంచలనం. 'బాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే' అని రజనీకాంత్ పదిహేడేళ్ల కిందట చెప్పిన డైలాగ్ని ఎవరూ మరిచిపోరు కూడా. ఈ నేపద్యంలో ప్రభుదేవా ఆ చిత్రాన్ని హిందీలో రీమేక్ చెయ్యబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ముంబై మీడియా ఈ వార్తలను ప్రచారం చేసింది. అక్షయ్ కుమార్ హీరోగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని,ఈ కాలానికి తగినట్లు ప్రభుదేవా మార్పులు చేసే పనిలో బిజీగా ఉన్నట్లు ప్రచారం చేసింది. అయితే ఈ విషయాన్ని ప్రభుదేవా ఖండిస్తున్నారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ''అసలు నాకు 'బాషా' చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచనే లేదు. ఎందుకంటే అది ఓ క్లాసిక్. అక్షయ్తో ఈ యేడాది మరో సినిమా చేస్తాను కానీ... అది వేరే కథ'' అని ఆయన చెప్పారు. ఇక ఈ సినిమా ఈ మధ్యనే హిందీలోకి అనువాదమైంది. అయితే ఆ చిత్రాన్ని రీమేక్ చేయాలని పలువురు దక్షిణాది హీరోలు సైతం ఆలోచనలు చేస్తున్నారు. ప్రభుదేవా వరసగా హిందీలో రీమేక్ లు చేసుకుంటూ దూసుకుపోతూండటంతో ఈ రీమేక్ ని కూడా ప్రభుదేవాని చేస్తాడని రూమర్స్ బయిలు దేరాయి.
ప్రస్తుతం
ప్రభుదేవా
బాలీవుడ్
లో
'రౌడీ
రాథోర్'
అనే
చిత్రానికి
దర్శకత్వం
వహిస్తున్నారు.
అక్షయ్
కుమార్
హీరోగా
చేస్తున్న
ఈ
చిత్రం
తెలుగులో
రాజమౌళి-రవితేజ
కాంబినేషన్లో
వచ్చిన
'విక్రమార్కుడు'
చిత్రానికి
రీమేక్.
ఈ
చిత్రానికి
విపరీతమైన
క్రేజ్
రావటంతో
బాలీవుడ్
హీరోల
దృష్టి
మొత్తం
ప్రభుదేవాపై
పడింది.
అందులోనూ
సల్మాన్
ఖాన్
తో
పోకిరి
రీమేక్
ని
వాంటెండ్
పేరుతో
తీసి
సూపర్
హిట్
చేయటం,ఇప్పుడు
దక్షిణాది
చిత్రాక
కధల
హవా
నడవటం
ఈ
ప్రభుదేవాకు
కలిసివచ్చింది.
సంజయ్
లీలా
భన్సాలి
వంటి
దర్శకుడు
సైతం
ఈ
మాస్
సబ్జెక్టుతో
హిట్
ఖాయం
అని
నమ్మి
నిర్మిస్తున్నారు.
పోకిరీ ని వాంటెడ్ మార్చి బాలీవుడ్ లో హిట్ కొట్టిన ప్రభుదేవాపై నమ్మకంతో ఈ ప్రాజెక్టుని అప్పచెప్పారు. సోనాక్షి సిన్హా ఈ చిత్రంలో అనూష్క పాత్రను చేయనుంది. ఈ చిత్రం పక్కా మాస్ మశాలా గా రూపొందించటానికి ప్రభుదేవా కసరత్తులు చేస్తున్నారు. అక్షయ్ కుమార్ సైతం చాలా రోజుల తర్వాత తాను ఇలాంటి మాస్ హీరో పాత్ర చేయటంతో చాలా సంతోషంగా ఉన్నాడు.ప్రభుదేవా దర్శకత్వంలో సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆ మధ్య తమిళంలో కార్తీ హీరోగా చిరుతై క్రింద రీమేకైంది.