Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
కాల్చి చంపేస్తానని బెదిరించిన హీరో..కేసు
తమిళ హీరో శింబు ఎప్పుడూ ఏదో ఒక కేసులోనో,వివాదంలోనో ఉండటం పరిపాటి అయిపోయింది.తాజాగా తిరుచ్చికి చెందిన డిస్ట్రిబ్యూటర్ రామ్మూర్తి వీరిపై తనను కాల్చి చంపేస్తానని బెదిరించాడని,శింబు నుంచి తనకు ప్రాణాపాయం ఉందని కేసు ఫైల్ చేసారు.చెన్నై కమిషనర్ ని కలిసి పెట్టిన కేసులో వివరాలు ఇలా ఉన్నాయి. గతంలో రామ్మూర్తి ఓ సినిమా విషయమై శింబు,రాజేంద్రలకు యాబై తొమ్మిది లక్షలు రూపాయలు అప్పు ఇచ్చానని,అందులో ఇంకా ముప్పై లక్షలు రూపాయలు తిరిగి ఇవ్వాలని,అందుకు కలిస్తే ఇంటికొచ్చి పట్టుకెళ్ళమన్నారని చెప్పారు.
ఇంటికి వెళ్ళిన తనని అవమానం చేసి దుర్బాషలాడి బ్రతికుండగానే కాల్చి చంపేస్తానని శింబు వార్నింగ్ ఇచ్చాడని,ఇక అప్పు విషయం మర్చిపొమ్మని చెప్పాడని ఆ కంప్లైంట్ లో రాసారు.ఇక శింబు ఈ విషయమై మాట్లాడటానికి మీడియా వద్ద నిరాకరించారు.ఆ డిస్ట్రిబ్యూటర్ ఎవరో తనకు తెలియదని,తన తండ్రి రాజేంద్ర ఈ వ్యాపార లావాదేవీలన్నీ చూస్తాడని చెప్తున్నాడు.ఇక ప్రస్తుతం శింబు రెండు తమిళ సినిమాల్లో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా తెలుగు దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో వేదం రీమేక్ లో చేసారు.