Don't Miss!
- News ఏకగ్రీవంగా సికింద్రాబాద్.. మోడీ-అమిత్ షా గేమ్ ప్లాన్?
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Sports ఆ భారత కుర్రాడు మామూలోడు కాదు- లారా
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
లక్ష్మీరాయ్ కి అంత సీన్ లేదని తేల్చేసాడు
లక్ష్మీరాయ్ కన్ఫ్యూజ్ అయినట్లుంది.వాస్తవానికి అశ్విన్ హీరోగా ఓ సినిమాని ప్లాన్ చేశా. అందులో లక్ష్మీరాయ్ని హీరోయిన్ గా తీసుకున్నాం. అయితే అజిత్ రంగంలోకి వచ్చిన తర్వాత కథ మొత్తం మార్చేశాం. ఈ చిత్రనిర్మాత లక్ష్మీరాయ్కి ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆమెను సోనా పాత్రకు ఎంపిక చేసి, అజిత్ సరసన త్రిషను హీరోయిన్గా తీసుకున్నాం.అయినా లక్ష్మీరాయ్ ఈ విధంగా నోటికి వచ్చినట్లు అనటం తగదని చెన్నై మీడియాతో దర్సకుడు వెంకట్ ప్రభు అని లక్ష్మీ రాయ్ గాలి తీసేసాడు. తమిళ చిత్రం - 'మంగాత్తా" (తెలుగులో 'గ్యాంబ్లర్"గా విడుదలైంది) నిర్మాణంలో ఉన్నప్పుడు త్రిషకు, లక్ష్మీరాయ్కి మధ్య ఎలాంటి గొడవ జరగలేదు. కానీ విడుదల తర్వాత లక్ష్మీరాయ్ మాటలు వివాదాన్ని రేపాయి. అజిత్ హీరోగా వెంకట్ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అజిత్ ప్రేయసి సంజనాగా త్రిష చేశారు.
ఇటీవల ఈ చిత్రం గురించి చెన్నయ్లో లక్ష్మీరాయ్ మాట్లాడుతూ - ''ముందుగా ఈ చిత్రకథను వెంకట్ప్రభు నాకే చెప్పి, సంజనా, సోనా పాత్రల్లో నీకేది నచ్చితే అది ఎన్నుకోమన్నారు. నాకు సోనా పాత్ర నచ్చి, అది చేస్తానన్నాను. హీరో గాళ్ఫ్రెండ్ అయిన సంజనా పాత్ర చెప్పుకోదగ్గ విధంగా లేదు. కానీ సినిమా కీలక మలుపు తిరిగినప్పుడల్లా సోనా ఉంటుంది. అందుకే ఈ పాత్ర చేశాను అన్నారు. ఈ మాటలు విని త్రిష మండిపడింది. లక్ష్మీరాయ్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని, 'గ్యాంబ్లర్"లో ముగ్గురు, నలుగురు హీరోయిన్లున్నా అది టాపిక్ కాదని, హీరో పక్కన ఎవరు చేస్తారో వారికే ఇంపార్టెన్స్ ఉంటుందని త్రిష అంది. ఈలోగా చిత్రదర్శకుడు వెంకట్ప్రభు ఈ విషయంపై విధంగా స్పందించి లక్ష్మీ రాయ్ కి చెక్ చెప్పాడు. ఇక ఈ చిత్రం తమిళనాట సంచలన వసూళ్లు కురిపిస్తోంది. తెలుగులో కూడా కొద్ది రోజుల క్రితమే విడుదలై నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ అందించారు.