Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హాస్పటిల్ లో ఉన్న కమల్ వాయిస్ మెసేజ్
చెన్నై: ప్రముఖ నటుడు కమల్హాసన్ రెండు రోజుల క్రితం తన ఆఫీస్ మెట్లు దిగుతుండగా కిందపడి గాయపడ్డ సంగతి తెలిసిందే. దీంతో కమల్ కాలుకి సర్జరీ చేశారు. తాను త్వరలోనే కోలుకుని నడుస్తానని కమల్ అన్నారు. ఈ మేరకు ఆయన తన అభిమానులని ఉద్దేసించి ఓ వాయిస్ మెసేజ్ ని విడుదల చేసారు.
ఇది ప్రమాదం, బాధ కావచ్చు.. కానీ అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు నాపై చూపించే ప్రేమకు మంత్రముగ్దుడ్ని అవుతున్నాను' అనే వాయిస్ మెసేజ్ను ప్రైవేటు ఆసుపత్రి నుంచి కమల్ పంపారు.
అలాగే 'నేను నిలబడగలుగుతున్నాను, త్వరలోనే నడుస్తాను. నా కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు. మీరు నాపై చూపిన అభిమానానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాల్లో తెలియడం లేదు' అనికమల్ చెప్పారు.
కమల్హాసన్ హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహిస్తున్న 'శభాష్ నాయుడు' చిత్రం తొలి షూటింగ్ షెడ్యూల్ లాస్ఏంజెల్స్లో ఇటీవల పూర్తైంది. ఈ చిత్రంలో కమల్ కుమార్తె శ్రుతిహాసన్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 'దశావతారం'లో కమల్ నటించిన బలరాం నాయుడు పాత్రలో మళ్లీ ఈ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. కమల్ చిన్న కుమార్తె అక్షరహాసన్ ఈ చిత్రానికి సహాయ దర్శకురాలిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.