Don't Miss!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Finance EPFO News: ఉద్యోగులకు గుడ్న్యూస్.. మారిన పీఎఫ్ విత్డ్రా రూల్స్.. ఎంతంటే..??
- News YS Jagan: జగన్ పై దాడి కేసులో ఇద్దరి అరెస్ట్-కాసేపట్లో కోర్టుకు..!
- Technology ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
- Sports IPL 2024: అంబానీ వల్ల మూడు జట్లు సర్వనాశనం!
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
ఇళయరాజాతో వివాదానికి తెర... స్నేహితుడి కోసం ఒప్పుకున్న ఎస్పీ బాలు?
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా గతంలో సింగర్లకు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మ్యూజిక్ కాన్సెర్టుల్లో తన పాటలు పాడాలంటే ముందుగా పర్మిషన్ తీసుకోవాలని, అందుకు తగిన రాయల్టీ కూడా తనకు చెల్లించాలంటూ ఆయన అందరికీ నోటీసులు పంపారు.
ఎప్పటి నుంచో మంచి స్నేహితులుగా ఉన్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజా మధ్య ఈ విషయంలో వివాదం ఏర్పడింది. ఎస్పీ బాలుకు కూడా ఆయన నోటీసులు పంపారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది.
ఇద్దరి మధ్య వివాదం ముగిసిందా?
ప్రస్తుతం ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మధ్య నెలకొన్న వివాదం సమసిపోయినట్లు తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇళయరాజా 76వ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించే మ్యూజిక్ కాన్సెర్టులో పాటలు పాడేందుకు ఎస్పీ బాలు ఒప్పుకున్నట్లు సమాచారం. చెన్నైలోని ఈవిపి ఫిల్మ్ సిటీలో జూన్ 2న ఈ కాన్సెర్ట్ జరుగబోతోందని తెలుస్తోంది.
రారా పోరా అనేకునేంత స్నేహం
ఇళయారాజ, ఎస్పీ బాలు మధ్య రారా.. పోరా.. అని మాట్లాడుకునేంత స్నేహం ఉంది. ఇద్దరూ కలిసి ఎనో అద్భుతమైన పాటలు అందించారు. అయితే ఇళయారాజ పంపిన నోటీసుల తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అయితే తమిళ ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖులు కల్పించుకుని వీరి మధ్య దూరాన్ని తగ్గించారట. అందకే తన స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా జరిగే వేడుకలో పాటలు పాడేందుకు ఎస్పీ బాలు ఒప్పుకున్నారట.
ఇళయారాజా నోటీసులకు అప్పట్లో బాలు కౌంటర్
‘‘ఒక పాట వెనుక చాలా మంది కష్టం ఉంటుందని.. దర్శకుడు.. నిర్మాత.. సంగీత దర్శకుడు.. సింగర్.. వాయిద్యకారులు ఇలా చాలా మందే ఉంటారని.. అలాంటప్పుడు హక్కులు మొత్తం సంగీత దర్శకుడికే ఇవ్వాలనటం సరికాదని.. అందరూ కలిసికట్టుగా శ్రమిస్తేనే సినిమా బయటకు వస్తుందని.. సినిమాలో ఒక సన్నివేశమైనా.. పాట అయినా.. దాని వెనుక సమిష్ఠి కష్టం ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు'' అని అప్పట్లో ఇళయారాజా నోటీసులకు ఎస్పీ బాలు కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
తనకూ ఆత్మాభిమానం ఉందంటూ...
అప్పట్లో ఇళయారాజ నోటీసులు పంపిన తర్వాత ఈ విషయమై ఆయనతో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కరించుకోవాలని కొందరు బాలుకు సూచించారట. అయితే తనకూ కొంచెం ఆత్మాభిమానం ఉందని బాలసుబ్రహ్మణ్యం సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేయడం హాట్ టాపిక్ అయింది.