Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
తనకు జరిగిన అవమానం విషయమై, అబిమానులకు ఇళయరాజా రిక్వెస్ట్ (వీడియో)
చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లో అవమానం జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయమై అబిమానులు చాలా భాధపడ్డారు. సోషల్ మీడియాలో ఈ విషయమై వారు ప్రభుత్వాన్ని నిలదీస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. ఇది తెలుసుకున్న ఇళయరాజా వెంటనే స్పందించి, మా వన్ ఇండియా తమిళ ప్రతినిధులతో మాట్లాడారు...ఈ వీడియోలో ఆయన ఇలాంటి వివాదాలతో విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని కోరారు. ఆయనేం మాట్లాడారో ఇక్కడ చూడండి.
ఇళయరాజాను కూడా గుర్తు పట్టని వారు ఉంటారా...ఆయన్ను కూడా చెకింగ్ పేరుతో ఇబ్బంది పెడతరా...అంటూ మండిపడుతున్నారు ఇళయరాజా అభిమానులు. ఆయకు జరిగిన అవమానంపై తమిళనాడులోని పొలిటికల్ పార్టీలు సైతం రంగంలోకి దిగి ఉన్నత స్దాయి విచారణ జరపాలి అంటున్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే... ఇళయరాజా కొన్ని రోజుల క్రితం తన కుమారుడు కార్తీక్రాజా,కుటుంబసభ్యులతో కలిసి మంగుళూర్ ప్రాంతంలో గల గుళ్ళూ గోపురాలు దర్శనార్థం వెళ్లారు. అనంతరం ఆదివారం రాత్రికి చెన్నైకి తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే బెంగళూర్ కెంపగౌడ వియానాశ్రయంలో ఆయన్ని అక్కడి సెక్యూరిటీ అధికారులు తనిఖీ చేశారు. బ్యాగును స్కానర్ వద్ద నిలిపేసి పూర్తి తనిఖి చేపట్టారు.
అప్పుడు ఇళయరాజా వద్ద దేవుని ప్రసాదం అయిన కొబ్బరి చెక్కలు ఉండడంతో దాన్ని ఏదోగా భావించి ఆయన్ను కదలనివ్వకుండా ఇబ్బందిపెడుతూ... వస్తువులను పూర్తిగా శోధన చేయడం ప్రారంభించారు. ఇళయరాజా వివరణ ఇవ్వబోయినా వినిపించుకోకుండా వారి కుటుంబసభ్యులు సహ ఒక పక్కన నిలబెట్టారు.
దీంతో ఆగ్రహం చెందిన ఇళయరాజా కుమారుడు కార్తీక్ రాజా అధికారులతో వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా అక్కడ సెక్యూరిటీ అధికారుల ఫొటోలు తీయటం మొదలెట్టారు. దాంతో వివాదం మరింత ముదిరింది. ఆ ఫొటోలను తొలిగించే దాకా సెక్యూరిటీ అధికారులు ఊరుకోలేదు.
అయితే అధృష్టవశాత్తు.. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఒక టీవీ చానల్ విలేకరి పరిస్థితిని గ్రహించి ఇళయరాజా గురించి అధికారులకు వివరించడంతో ఆయన్ని కుటుంబసభ్యులు సహా విమానాశ్రయంలోకి అనుమతించారు. ఈ తతంగం అంతా సీసీ కెమెరాల్లో చూసిన ఉన్నతాధికారి ఒకరు వెంటనే అక్కడికి వచ్చి ఇళయరాజాకు క్షమాపణ చెప్పి ఆయన్ని చెన్నై విమానం ఎక్కించారు.
అనంతరం ...ఇళయరాజాకు జరిగిన అవమానానికి ఎండీఎంకే నేత వైగో తీవ్రంగా ఖండించారు.ఈ సంఘటన గురించి ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రపంచ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంగీత దర్శకుడు ఇళయరాజా అన్నారు.
ఏ దేశ సంగీతదర్శకుడు చేయనటువంటి సింపోనిని చేసిన గొప్ప సంగీత దర్శకుడు ఆయన అని అన్నారు.ఆయనకు జరిగిన అవమానం గురించి ఉన్నత స్థాయిలో విచారణ జరిపి అందుకు బాధ్యులైన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.