Don't Miss!
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- News Lok Sabha Election 2024: 102 సీట్లలో తొలి దశ పోలింగ్ పూర్తి- దాదాపు 60 శాతం ఓటింగ్..!
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కమల్, ఇళయరాజా ప్రాక్టికల్ జోక్
ఇళయరాజా మాటల్లోనే... 'ఎన్నడి మీనాక్షి' అనే పాటను ఏవీఎం స్టూడియోలో రికార్డింగ్ చేస్తున్న రోజులవి. ఆ రికార్డింగ్ చూసేందుకు కొందరు కళాశాల విద్యార్థినులు వచ్చారు. వారిని అట పట్టించాలని నేను కాగితాన్ని తీసుకెళ్ళి కమలహాసన్కి ఇచ్చాను. ఆయన దాన్ని తదేకంగా చూస్తూ... ఈ మెట్టు పైనపెట్టండి, దీనిని కిందకి జరపండని నాకు చెప్పారు. సరేనంటు వినయంగా తల ఉపాను. అది చూసి విద్యార్థినులందరూ ఒకటే గుసగుసలు. కమల్కు సంగీతంపై ఇంత పట్టు ఉందా? ఇళయరాజా ఆయన్ను అడిగి స్వరాలు సమకురుస్తారా అని చెప్పుకోవడం వినిపించింది. పక్కగదిలోకి వెళ్లి మేమిద్దరం పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నామని తెలిపారు.
ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా కమల్...విశ్వరూపం విడుదల గురించే చర్చ. వెండి తెర కన్నా ముందుగా బుల్లితెరపై డీటీహెచ్ ద్వారా విడుదల చేయాలనుకునే చిత్రాలకు, సంబంధిత హీరోలకు, నిర్మాతలకు తాము సహకరించమని తమిళనాడు థియేటర్ యజమానుల సంఘం పేర్కొంది. ఈ మేరకు చెన్నైలోని సంఘం కార్యాలయంలో జరిగిన అత్యవసర సమావేశంలో నిర్ణయం తీసుకుంది. కమల్ తన 'విశ్వరూపం' చిత్రాన్ని డీటీహెచ్ ద్వారా బుల్లి తెరపై విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీనిపై థియేటర్ యజమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ''ఇలా విడుదల చేయడం వల్ల థియేటర్ యజమానులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి జయలలిత జోక్యం చేసుకుని సరైన నిర్ణయం తీసుకోవాలి'' అని సంఘం సభ్యులు అభిప్రాయపడ్డారు.