Don't Miss!
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- News పోటీ నుంచి తప్పుకున్న శ్రీరాములు భార్య, రంగంలోకి గాలి జనార్దన్ రెడ్డి, వార్ వన్ సైడ్ కాదు, పోటీ !
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
- Sports ప్రశాంతంగా ఉన్నా.. ఇక చాలు- నరైన్ షాకింగ్ కామెంట్స్
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
డబ్బు కోసం మాత్రమే చేయను : ఇళయరాజా
చెన్నై : డబ్బు కోసమే తాను సంగీతాన్ని అందించట్లేదని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అన్నారు. తాను సంగీతం అందించిన 'ఒరు వూరులే' చిత్ర ఆడియో సీడీలను దర్శకుడు బాలూ మహేంద్రతో కలిసి ఆయన ఆవిష్కరించారు. శనివారం నగరంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇళయరాజా మాట్లాడారు.
ఇళయరాజా మాట్లాడుతూ..... 'ఒరు వూరులే' చిత్రాన్ని పూర్తిగా తిలకించాకే సంగీతం అందించేందుకు అంగీకరించానని అన్నారు. ఏ చిత్రానికి కూడా తాను మూడు రోజులకు మించి సంగీతం అందించింది లేదని, అది వందరోజుల చిత్రమైనా, వజ్రోత్సవ చిత్రమైనా తన పంథా ఒకటేనన్నారు.
కొత్త దర్శకుల చిత్రాలకు సంగీతం అందించటం పట్ల తానెప్పుడూ వెనకాడలేదని, అయితే అలాంటి దర్శకుల చిత్రాలకు సంగీతం అందించవద్దంటూ పలువురు తన వద్ద ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. తానెప్పుడూ డబ్బు కోసం మాత్రమే సంగీతం అందించలేదని, అలా డబ్బు కోసం తాను ఆశపడి ఉంటే స్వచ్ఛమైన సంగీతం తననుంచి ఎప్పుడో దూరమై ఉండేదన్నారు.
కొత్త దర్శకుల చిత్రాలకు సంగీతం అందించేందుకు కూడా తానెప్పుడూ సిద్ధంగా ఉన్నానని, వారు తనను నమ్ముకుని ముందుకు రావొచ్చన్నారు. వసంతకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో వెంకటేష్-నేహాపటేల్ జంటగా నటించారు.