Don't Miss!
- News విడుదల రజిని కిడ్నాప్...నామినేషన్ వేయకుండా
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'పుణ్యకోటి' : ఇళయరాజా తొలిసారిగా...
హైదరాబాద్ : ఇన్నాళ్లుగా సాధారణ చిత్రాలకు సంగీతమందించిన ఇళయరాజా ఇప్పుడు తొలిసారిగా యానిమేషన్ సినిమాకు స్వరాలందించబోతున్నారు. 'పుణ్యకోటి' పేరుతో రూపొందుతున్న ఓ యానిమేషన్ సినిమాకు ఆయన సంగీత దర్శకుడుగా పని చేస్తున్నారు. వచ్చే ఆగస్టులో ప్రారంభంకానున్న ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. సంస్కృతంలో రూపొందబోతున్న తొలి యానిమేషన్ చిత్రమిది. చిన్నప్పటి నుంచి మనం వింటున్న ఆవు-పులి కథ అని తెలుస్తోంది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
''ఈ కథ గురించి చెప్పిన వెంటనే ఇళయరాజా మమ్మల్ని చాలా ప్రోత్సహించారు. మీ వెనుక నేనున్నా అంటూ ధైర్యమిచ్చారు. 'క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూపొందబోతున్న ఈ సినిమాకు మీ అందరి ఆశీస్సులు కావాలి' అని అభిమానులకు పిలుపునిచ్చారు కూడా'' అంటున్నారు చిత్ర దర్శకుడు వి. రవిశంకర్.
ఈ సినిమా విషయానికొస్తే 'పుణ్యకోటి' అనే కన్నడ ఫోక్ సాంగ్ ఆధారంగా యానిమేషన్లో సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
అభిమానులు ఇసైజ్ఞాని అని పిలుచుకునే ఈ అలుపెరగని సంగీత యోధుడు నేడు 72వ ఏట అడుగుపెడుతున్నారు. నాలుగు జాతీయ పురస్కారాలు, పద్మభూషణ్ (2010) పురస్కారాలతో భారత ప్రభుత్వం ఆయన్ని గౌరవించింది.
ఇక...
డీజీపీ, చెన్నై పోలీస్ కమిషనర్, తమిళనాడులోని అన్ని జిల్లాల్లో ఉన్న ఎస్ఐలకు సంగీత జ్ఞాని ఇళయరాజా లేఖ రాశారు. ''నా పాటలను తస్కరిస్తున్నారు. నా అనుమతి లేకుండా సొమ్ము చేసుకుంటున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలి'' అని ఇళయరాజా ఆ లేఖలో కోరారు. గతంలోనూ ఆయన ఇలా సీరియస్ అయ్యి...కోర్టుకు వెళ్లారు..కానీ పెద్ద ఫలితం కనపడలేదు.
తన పాటలు తన అనుమతి లేకుండా ఇష్టం వచ్చినట్లు టీవీ, రేడియో ఛానల్స్ ప్రసారం చేయడంపై, ఆడియో కంపెనీలు సీడీలు చేసి అమ్మడంపై ఇళయరాజా ఆగ్రహంగా ఉన్నారు. తన పాటలను సీడీల రూపంలో, ఇంటర్నెట్ డౌన్ లోడ్స్ రూపంలో అమ్ముతున్న ఐదు ఆడియో కంపెనీలపై కేసు వేసారు కూడా.
మద్రాసు హై కోర్టు కూడా ఆయనకే అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇకపై తన పాటలు ఎవరు ఎక్కడ వాడాలన్నా తన అనుమతి తీసుకోవాల్సిందే, తన వద్ద రైట్స్ కొనుక్కోవాల్సిందే అని ఇళయరాజా స్పష్టం చేసారు.