ఒలింపిక్స్ ఓపినింగ్ లో ఇళయరాజా పాట
ఈ విషయమై ఇళయరాజా సన్నిహితుడు ఒకరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ..ఈ పాటను ఎంపిక చేసుకోవటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నారు. ఇక స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేమ్ డానీ బోయల్ ఈ పంక్షన్ ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఓపినింగ్ సెర్మనీ జరగనుంది. ఆయనే ఈ పాటలను డిజైన్ చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఈ పాటను తీసుకున్నారని సమాచారం.
ప్రస్తుతం ఇళయరాజా నాని, సమంత జంటగా గౌతమ్వాసుదేవమీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎటో వెళ్లిపోయింది మనసు'చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో రెండు బిట్ సాంగ్స్ తో కలిపి తొమ్మిది పాటలు ఉన్నట్లు తెలుస్తోంది. అనంత శ్రీరాం ఈ పాటలనన్నిటినీ సింగిల్ కార్డుతో రాసారు. ఈ చిత్రం ప్రోమో ఇప్పటికే రిలీజయ్య ఇళయారాజా అభిమానుల్లో ఆసక్తిని రేపింది. గ్యారెంటీగా మ్యూజికల్ హిట్ అవుతుందని భావిస్తున్నారు.
నాని మాట్లాడుతూ ''చిన్నప్పటి నుంచీ ఇళయరాజా సంగీతం అంటే పిచ్చి. నా ఫోన్లో కూడా ఆయన పాటలే ఉంటాయి. నేను సహాయ దర్శకుణ్ని కావడానికి స్ఫూర్తినిచ్చిన దర్శకుల్లో గౌతమ్మీనన్ ఒకరు. వీరిద్దరితో సినిమా చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఈ కథ విన్నప్పుడు నా ప్రేమ కథే అనిపించింది. మనసు ఎటో వెళ్లిపోయింది. ప్రేక్షకులకీ అలాంటి భావనే కలుగుతుంది''అన్నారు.


Click it and Unblock the Notifications












