నాగార్జున అజాద్ చిత్రం రీమేక్ చేస్తున్న హీరో
నాగార్జున, సౌందర్య కాంబినేషన్ లో తిరుపతిస్వామి డైరక్ట్ చేసిన అజాద్ చిత్రం గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రం ఇప్పుడు తమిళంలో రీమేక్ అవుతోంది. ఇళయపతిగా పేరు తెచ్చుకున్న విజయ్ తన యాభై వ చిత్రంగా దీనిని చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఈ చిత్రాన్ని జయం రాజా డైరక్ట్ చేయనున్నారు. ఇక దీనిని విజయ్ సూచించి మార్పులతో స్క్రిప్టు చేయమని చెప్పాడట. దాన్ని ఫాలో అవుతూ రాజా మాస్ మసాళాలు అద్దటంతో వర్కవుట్ అయింది. ఇక రాజా ఇంతకు ముందు విజయ్ తో ఏ చిత్రాన్నీ చేయలేదు. ఇదిలా ఉంటే విజయ్ 50 చిత్రం డైరక్ట్ చేయటానికి బాగా పోటీ వచ్చింది. ఈ వరసలో దర్శకుడు కె.యస్.రవికుమార్ ముందున్నారు. అయితే రాజాకి రీమేక్ ల కింగ్ గా పేరుండటం కలసివచ్చింది.
More from Filmibeat
నాగార్జున అజాద్ తిరుపతి స్వామి సౌందర్య విజయ్ కె.యస్.రవికుమార్ 50వ సినిమా జయం రాజా vijay azad soundarya nagarjuna raja jayam ilaythalapathy


Click it and Unblock the Notifications











