ఇలియానాని హాస్పటల్లో చూసి..
గోవా బ్యూటీ ఇలియానాని నిన్న చెన్నైలోని ఘోషా హాస్పటిల్ లో చూసి చాలామంది కంగారుపడ్డారు. అయితే ఆమె వచ్చింది ఓ చిత్రం షూటింగ్ నిమిత్తం అని ఆ తర్వాత కూల్ అయ్యారు. వివరాల్లోకి వెళితే శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న త్రీ ఇడియట్స్ చిత్రం షూటింగ్ నిమిత్తం నిన్న హాస్పటిల్ సీన్స్ తీసారు. అయితే ఇలియానా షూటింగ్ గ్యాప్ లో హాస్పటిల్ పరికించింది.దాంతో అక్కడకి వచ్చినవారు ఇలియానాని చూసి గుర్తుపట్టారు.ఇక ఆ సీన్ లో విజయ్, శ్రీకాంత్,జీవా పాల్గొన్నారు. ఇక ఈ షెడ్యూల్ పెద్దదని ఇదే ఫైనల్ అని చెప్తున్నారు. మొదట అనుకున్న డేట్స్ కన్నా ఎక్కవ అవసరమైనా ఆర్టిస్టులంతా ఎడ్జెస్టు చేసుకుని మరీ నటి్స్తున్నారు. హిందీ సినిమాకు కొద్ది పాటి మార్పులు చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని తెలుగులోనూ విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











