Don't Miss!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- News ఎస్..ఇదే కడప, రాయలసీమ కల్చర్ - సీఎం జగన్..!!
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రెమ్యూనరేషన్ లొల్లి: పంతం నెగ్గించుకున్న కమెడియన్... ఓకే చెప్పిన శంకర్!
తమిళ సినీ పరిశ్రమలోని టాప్ కమెడియన్లలో ఒకరైన వడివేలకు, ప్రముఖ దర్శకుడు శంకర్ మధ్య కొన్ని రోజులుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ ఫిర్యాదుతో తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టీఎఫ్పీసీ) అతడిపై గతంలో రెడ్కార్డు(బ్యాన్) జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి.
దర్శకుడు శంకర్ గతంలో తన ప్రొడక్షన్ సంస్థలో వడివేలు హీరోగా 'హింసించే 23వ పులకేశి' అనే హిట్ మూవీ తీశారు. దీనికి సీక్వెల్గా 'హింసించే 24వ పులకేశి' సినిమా ప్రారంభించారు. అయితే శంకర్-వడివేలు మధ్య విబేధాలు రావడంతో షూటింగ్ ఆగిపోయింది. తాజాగా ఇద్దరి మధ్య రాజీకుదిరినట్లు తెలుస్తోంది.
నిర్మాతల మండలి మధ్యవర్తిత్వం ఫలించిందా?
వడివేలు, శంకర్ మధ్య రాజీ కుదిర్చేందుకు తమిళ నిర్మాతల మండలి పలు దఫాలు చర్చలు జరిపింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరి మధ్య రాజీ కుదిరిందని, త్వరలోనే 'హింసించే 24వ పులకేశి' సినిమా మళ్లీ మొదలు కాబోతోందని తెలుస్తోంది.
ఏమిటి గొడవ?
సినిమా ఓకే అయి అగ్రిమెంట్ అయిన తర్వాత వడివేలకు, దర్శక నిర్మాతలకు చాలా గొడవలు జరిగాయి. స్కిప్టు విషయంలో అతడు వేలు పెట్టడంతో చిన్నగా మొదలైన విబేధాలు పెరిగి పెద్దవయ్యాయి. దీంతో పాటు తనకు చెల్లించే రెమ్యూనరేషన్ విషయంలో కూడా వడివేలు హ్యాపీగా లేడని టాక్. ఈ నేపథ్యంలో షూటింగుకు సరిగా రాకుండా ఇబ్బంది పెట్టాడు, కొన్ని రోజుల తర్వాత ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు వడివేలు ప్రకటించాడు.
రేర్ వీడియో వైరల్: రాజమౌళి చెప్పిన కఠిన నిజాలు, మీరు ఏకీభవిస్తారా?
వడివేలు వల్ల దాదాపు 9 కోట్ల నష్టం?
అయితే ఈ సినిమా నుంచి వడివేలు అర్దాంతరంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో శంకర్ నిర్మాతల మండలిని ఆశ్రయించాడు. వడివేలు అర్దాంతరంగా తప్పుకోవడం వల్ల రూ. 9 కోట్ల నష్టం వాటిల్లిందని, దాన్ని వెంటనే చెల్లించాలని తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిర్ణయించింది. అయితే అందుకు వడివేలు ఒప్పుకోక పోవడంతో అతడిపై రెడ్ కార్డ్ జారీ చేశారు. ఈ క్రమంలో వడివేలు కూడా ఒక మెట్టుదిగక తప్పలేదు.
రెమ్యూనరేషన్ పెంచేందుకు శంకర్ ఓకే చెప్పాడా?
పలు దఫాల చర్చల అనంతరం... వడివేలు డిమాండ్ మేరకు అతడి రెమ్యూనరేషన్ పెంచేందుకు శంకర్ ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో జనవరి నుంచి మళ్లీ షూటింగ్ మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.