Don't Miss!
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Sports చెన్నై సూపర్ కింగ్స్లో భారీ మార్పులు..!!
- News పవన్ కల్యాణ్ దూకుడు - తాజా నిర్ణయంతో..!!
- Finance IT News: బెంగళూరులో టెక్కీలు సంచలన నిర్ణయం.. అయోమయంలో హౌస్ ఓనర్స్..
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అంజలి కిడ్నాప్కై ప్లాన్.. స్వయంగా వెల్లడించిన హీరోయిన్
తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అంజలి కిడ్నాప్కై ఓ ముఠా ప్లాన్ చేస్తోందట. కాస్త ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఈ విషయం అంజలియే స్వయంగా చెప్పింది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ భామ లేటెస్ట్ మూవీ 'సిందుబాద్'. ఈ శుక్రవారమే (జూన్ 21) విడుదల కావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాల కారణంగా ఆగిపోయింది. ఈ మేరకు ఓ ప్రముఖ మీడియాతో ముచ్చటించిన అంజలి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.
సింద్బాద్ చిత్రంలో విజయ్ సేతుపతి, అంజలి జంటగా నటించారు. విజయ్ సేతుపతితో ఆమెకిది రెండో సినిమా. ఈ చిత్రంలో హీరో విజయ్ సేతుపతితో పాటు ఆయన కొడుకు కూడా నటించడం జరిగింది. ఈ సినిమా విశేషాలను పంచుకున్న అంజలి.. ఈ చిత్రంలో తనను ఓ ముఠా కిడ్నాప్ చేస్తుందని, వారి వద్ద నుంచి హీరో విజయ్సేతుపతి ఎలా తనను కాపాడారన్నదే చిత్ర కథాంశమని చెప్పింది. అయితే అనివార్య కారణాలతో ఆగిపోయిన సింద్బాద్ చిత్రం విడుదల విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక అంజలి నటిస్తున్న ఇతర సినిమాల విషయానికొస్తే.. మాధవన్, అనుష్క హీరోహీరోయిన్లుగా రాబోతున్నసైలెన్స్ సినిమాలో అంజలి ముఖ్య పాత్రలో దర్శనమీయనుంది. అదేవిధంగా తమిళంలో రెండు చిత్రాలు, తెలుగులో మరో చిత్రంలోను నటిస్తోంది. ఇక తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచనలు లేవని తాజాగా జరిగిన ఈ సమావేశంలో చెప్పుకొచ్చింది అంజలి. అదేవిధంగా రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచనలు కూడా తనకు అస్సలు లేవని తేల్చిచెప్పింది. తెలిసిన పని మాత్రమే చేయాలి తప్ప తెలియని పనులు చేయకూడదనేది తన సిద్ధాంతమని పేర్కొంది ఈ రాజోలు చిన్నది.