Don't Miss!
- News కడపలో వైఎస్ షర్మిలకు ప్లస్ గా వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ లేఖాస్త్రం!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
50లక్షల కోసం చరణ్ ని బ్లాక్ మెయిల్ చేస్తోందా...!?
తమిళ సెక్సీతార సోనా ఏదోలా ప్రచారం సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తోందంటూ కోలీవుడ్ జనం ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల ప్రముఖ గాయకుడు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం తనయుడు చరణ్, తనని రేప్ చేయబోయాడంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందని తేల్చేస్తున్నారు. ఇటీవల తమిళ నటుడు వైభవ్ (దర్శకుడు కోదండరామిరెడ్డి తనయుడు) ఇంట్లో జరిగిన పార్టీలో ఈ సంఘటన జరిగిందని ఆమె చెన్నయ్ లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఆ పార్టీలో పాల్గొన్న దర్శకుడు వెంకట్ ప్రభుతో పాటు మరెవరూ కూడా ఈ విషయంలో సోనాను సమర్ధించడం లేదు. కావాలనే ఆమె చరణ్ పై కేసు పెట్టిందని అంటున్నారు.
ఈ కేసుని ఉపసంహరించుకోవాలంటే...తనకు 50లక్షలు ఇవ్వాలని సోనా బెదిరిస్తోందట. లేని పక్షంలో కేసుని వెనక్కి తీసుకోనని అంటోందట. కనీసం 20,30 లక్షలైనా ఇచ్చినా ఓకే అంటోందట. ఈ వ్యవహారం చూసిన వాళ్లు సోనా దగ్గర చరణ్ బాగా ఇరుక్కున్నాడని అంటున్నారు. మరి డబ్బిచ్చి సోనా నోరు మూయిస్తాడో...ఈ వివాదాన్ని చరణ్ సాగదీసుకుంటాడో వేచి చూడాల్సిందే.
ఈ నేపథ్యంలో తాజాగా గాయకుడు చరణ్ కూడా తొలిసారిగా నోరు విప్పాడు. తనపై అభాండాలు వేసి తన పరువు బజారుకీడ్చిన సోనాపై న్యాయపరమైన పోరాటం చేయడానికి సమాయత్తమవుతున్నాననీ, త్వరలోనే పత్రికా సమావేశం పెట్టి వివరాలు తెలియజేస్తాననీ చరణ్ చెబుతున్నాడు. ఒకవేళ సోనా చేస్తున్న ఆరోపణలు నిజమే అయితే కనుక చరణ్ శిక్షార్హుడేననీ, అలా కాకుండా అతనిని బ్లాక్ మెయిల్ చేయడానికి ఆమె ప్రయత్నిస్తుంటే కనుక అది క్షమార్హం కాదనీ కోలీవుడ్ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏమైనా, కేసు రిజిస్టర్ అయింది కనుక పోలీసుల విచారణలో నిజానిజాలు త్వరలోనే తేలిపోతాయి!