Don't Miss!
- Sports Hardik Pandya: కెప్టెన్గా చెత్త రికార్డు సాధించా.. హ్యాపీనే!
- News ఎన్నికల వేళ ఆలీ కీలక నిర్ణయం..!!
- Finance DA Hike: కోటి మంది ఉద్యోగులకు శుభవార్త.. మార్చి 30 నుంచి పెరిగిన జీతాలు..!!
- Lifestyle ఈ అలవాట్లు ఉన్నవారికి తీవ్ర కడుపులో అల్సర్ వచ్చే అవకాశం ఉంది...వెంటనే బయటపడండి...!
- Automobiles జనరల్ టికెట్ ప్యాసింజర్స్తో ఫుల్ రష్గా రిజర్వ్డ్ కోచ్లు.. ప్రయాణికుడి కంప్లెయింట్, రైల్వే శాఖ సీరియస్
- Technology వన్ప్లస్ నార్డ్ CE 4 ధరల వివరాలు లీక్.. గత మోడల్ కంటే తక్కువ ధరకే అందుబాటులోకి..!
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
'కడలి' హీరో కొత్త సినిమా మొదలైంది
గౌతంకార్తిక్, హీరోయిన్ ప్రియా ఆనంద్, వివేక్, దర్శకుడు ఎస్ఎం వసంత్, శ్రీరంజనిలకు సంబంధించిన సన్నివేశాన్ని తెరకెక్కించారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానరుపై తెరకెక్కుతోంది. యువన్ శంకర్రాజా సంగీతం సమకూర్చుతున్నారు. శుక్రవారం నుంచి చెన్నైలో చిత్రీకరణ కొనసాగుతుందని యూనిట్ పేర్కొంది.
'3' చిత్రం ద్వారా తన భర్తను హీరోగా చేసి దర్శకత్వం వహించారు ఐశ్వర్య. దర్శకురాలిగా మంచి మార్కులు సంపాదించుకున్నా.. ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు నిరాశే మిగిల్చింది. ఇప్పుడు రెండో సినిమా పనుల్లో పూర్తిగా నిమగ్నమైంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ను కూడా పూర్తి చేసింది. ధనుష్ను హీరోగా అనుకున్నా.. ప్రస్తుతం ఆయన ఇతర చిత్రాల్లో బిజీగా ఉండటంతో మరో హీరో కోసం వెతుకులాటలో పడింది ఐశ్వర్య. అలా తన కన్ను నటుడు కార్తీక్ కుమారుడు గౌతంపై పడింది.
ఈ సినిమా కథ కూడా కార్తీక్కు నచ్చడంతో ఆయన ఓకే చెప్పినట్టు తెలిసింది. అనిరుధ్ సంగీతం సమకూర్చుతున్నాడు. తొలి చిత్రం ద్వారా సంపూర్ణ విజయాన్ని అందుకోని ఐశ్వర్య.. ఈ సినిమాతో ఆ కల నెరవేర్చుకుంటారేమో వేచిచూడాలి. మరో ప్రక్క డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న '3'రైట్స్ కూడా అమ్ముడుపోయాయి. ఈ చిత్రం త్వరలో హిందీలో తెరకెక్కనుంది. నిఖిల్ అద్వానీ ఈ చిత్రం రీమేక్ చేయనున్నారు. హిందీ నేటివిటీకోసం కొన్ని మార్పులు చేస్టున్నట్లు చెప్తున్నారు. అలాగే '3'లో నటనతో ఆకట్టుకున్న శ్రుతిహాసన్ హిందీలో రీమేక్లోనూ అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
ధనుష్ హీరోగా ఆయన భార్య ఐశ్వర్య తెరకెక్కించిన చిత్రం '3'. అందులో హీరోయిన్ గా శ్రుతిహాసన్ నటించింది. చిత్ర విడుదలకు ముందే 'వై దిస్ కొలవెరి డి' పాట సంచలనం సృష్టించటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో అత్యధిక కేంద్రాల్లో చిత్రం విడుదలైంది. వూహించిన ఫలితం దక్కలేదు. నటిగా శ్రుతిహాసన్ మంచి మార్కులు మాత్రం కొట్టేసింది.తెలుగులో సైతం ఈ చిత్రం మొదటి రోజే పెద్ద ప్లాప్ టాక్ తెచ్చుకుని చతికిలపడింది. రైట్స్ కొనుక్కున్న నిర్మాత నట్టికుమార్ ని నట్టేట ముంచేసింది.