Don't Miss!
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
డైరెక్ట్ గా ఓటీటీ విడుదలకు సిద్దమైన ధనుష్ మూవీ.. ఒకేసారి 17 భాషల్లో బిగ్గెస్ట్ రిలీజ్!
లోకప్ కాన్సెప్ట్ లకు కూడా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా క్రేజ్ అందుతోంది. ఎప్పుడైతే ఓటీటీ హవా ఎక్కువయ్యిందో అప్పటి నుంచి ఇండియా సినిమాలకు కూడా విదేశాల్లో మంచి క్రేజ్ దక్కుతోంది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ కొన్ని సినిమాలను వీలైనన్ని ఎక్కువ భాషల్లో విడుదల చేస్తుండడం వైరల్ గా మారింది. ఇక ధనుష్ కొత్త సినిమాను కూడా అదే తరహాలో భారీగా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.
కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన జగమే తందిరం అనే సినిమా కోసం తమిళ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 18న సినిమాను నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయనున్నారు. మొదట ఈ సినిమాను డైరెక్ట్ గా థియేటర్స్ లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల వలన థియేటర్స్ ఓపెన్ గా లేకపోవడంతో ఓటీటీ డీల్ కు ఒప్పుకోక తప్పలేదు. తెలుగులో ఈ సినిమాను జగమే తంత్రం అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు.
నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డైరెక్ట్ రిలీజ్ హక్కులను 55కోట్లకు కొనుగోలు చేసింది. పెట్టిన బడ్జెట్ కు ఇది మంచి ప్రాఫిట్. అందుకే నిర్మాతలు పెద్దగా ఆలోచించకుండా రిలీజ్ హక్కులను ఇచ్చేశారు. ఇక 190 దేశాల్లో 17 భాషల్లో సందడి చేయనున్న ఈ మూవీ తప్పకుండా ఒక సెన్సేషన్ ను క్రియేట్ చేస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉంది. మరి ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ధనుష్ చివరహా కర్ణన్ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.