Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
ప్రముఖ దర్శకుడు బాలచందర్ ఆస్తులు వేలానికి... ఏం జరిగింది?
ప్రముఖ దక్షిణాది సినీ దర్శకుడు, దాదా ఫాల్కే అవార్డు గ్రహీత, దివంగత కె. బాలచందర్ ఆస్తులపై ఓ ప్రైవేటు బ్యాంకు వేలం ప్రకటన వేయడంతో అభిమానులు షాకయ్యారు. ఎన్నో అద్భుతమైన సినిమాలు తీయడంతో పాటు , సినీ పరిశ్రమకు రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి స్టార్లను, ఎంతో మంది హీరోలను, హీరోయిన్లను పరిచయం చేసిన ఆయన ఆస్తులు ఇలా వేలానికి రావడం అభిమానులను జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ వేలం వ్యవహారంపై బాలచందర్ కుమార్తె పుష్పా కందస్వామి స్పందించారు.
Recommended Video
వేలం నోటీసులు నిజమే
యూకో బ్యాంకు నుండి వేలం ప్రకటన వచ్చిన మాట నిజమే అని, ఇతర ప్రొడక్షన్స్ సంస్థల మాదిరిగానే బాలచందర్ కు చెందిన కవితాలయా సంస్థ కూడా ఓ టీవీ సీరియల్ నిర్మాణం కోసం బ్యాంకు లోన్ తీసుకుందని, ఇందు కోసం మైలాపూర్లోని ఇంటిని, ఆఫీసును 2010లో యూకో బ్యాంకులో తాకట్టు పెట్టారని పుష్పా తెలిపారు.
2015లోనే ఆ సీరియల్ ఆగిపోయింది
సదరు సీరియల్ నిర్మాణం 2015లోనే ఆగిపోయిందని, అప్పటి వరకు బ్యాంకు రుణంపై అసలుతో పాటు కొంతమేర వడ్డీని చెల్లించామని తెలిపారు. మిగిలిన మొత్తాన్ని వన్ టైమ్ సెట్మెంటులో చెల్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, చర్చలు జరుగుతుండగానే బ్యాంకు నుండి వేలం ప్రకటన వచ్చిందన్నారు.
ఆందోళన వద్దు...
అభిమానులు ఆందోళన చెందాల్ని అవసరం లేదని, బాలచందర్ ఆస్తులు వేలం వేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని పుష్పా తెలిపారు.
బాలచందర్
బాలచందర్ 2014లో తన 84వ ఏట మరణించిన సంగతి తెలిసిందే. 100కుపైగా సినిమాలు, పలు సీరియల్స్ తీసిన ఆయన ప్రతిష్టాత్మక దాదా ఫాల్కే అవార్డుతో పాటు, పద్మశ్రీ, ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్, కలైమమని అవార్డులు సొంతం చేసుకున్నారు.