Don't Miss!
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పెళ్లికి రాలేదనే కోపంతో రజనీ, విజయ్ సినిమాలను నష్ట పరుస్తున్నారా?
చెన్నై: తమిళ స్టార్ విజయ్ నటించిన 'తేరి' చిత్రం ఇటీవల విడుదలై తమిళనాడు బక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అయితే చెంగల్పట్టు, పరిసర ప్రాంతాల్లో 60 థియేటర్లలో మాత్రం విడుదల కాకపోవడంతో చిత్రానికి నష్టం వాటిల్లిందని మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో చిత్ర నిర్మాత కలైపులి.ఎస్. థాను విచారం వ్యక్తం చేశారు.
థియేటర్ల సంఘ కార్యదర్శి పన్నీర్ సెల్వం వల్ల కొన్ని సినిమాలకు ఏదో రూపంలో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. అతని కూతురి పెళ్లికి రజనీకాంత, విజయ్ హాజరు కాలేదని, దాన్ని మనసులో పెట్టుకు నే ఇప్పుడు 'తెరి' విడుదల విషయంలో ఇబ్బంది పెట్టారన్నారు. రాబోయే 'కబాలి'కి కూడా ఏదో రూపంలో సమస్యని సృష్టించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
'తెరి' చిత్రాన్ని సత్యం, ఐనాక్స్, పీవీఆర్ వంటి కొన్ని థియేటర్లలో విడుదల చేశాను. 'ఆ థియేటర్ల కి ఒప్పందం ప్రకారం వెళ్లిన మీరు మా దగ్గరకు అదే ఒప్పందంతో ఎందుకు రాలేదు' అని చెంగలప్పట్టు థియేటర్ యజమాను లు నన్ను ప్రశ్నించారు. నిజమే.. అక్కడున్న థియేటర్ల తరహాలోనే మీరూ థియేటర్లను కట్టించారు. అయితే మీతో ఒప్పుకున్న ఒప్పందం ప్రకారం వచ్చిన వసూళ్లను మాకు సరి గా అందించడం లేదు కదా! అలాంటప్పుడు మీ ఒప్పందం ప్రకారం ఎలా నడుచుకోగలను?' అని కోపంగా ప్రశ్నించారు థాను.
'రామానుజం (థియేటర్ యాజమాన్య సంఘ మాజీ అధ్యక్షుడు) వంటి మనసున్న మేథావుల స్థానంలో ఇపుడు ఇలాంటి రౌడీలు వచ్చి కూర్చున్నారు. దీని వల్ల మాలాంటి నిర్మాత లు ఎంతో నష్టపోతున్నారు. మేమేమీ దోపిడీదారులం, హంతకులమో కాదని నిర్మాత కలైపులి థాను థియేటర్ల యజమానులపై విరుచుకుపడ్డారు. 'తెరి' విషయాన్నే తీసుకుంటే చెన్నైలో తొలి రోజే కోటి రూపాయిలు వసూలు చేసింది. సరైన ఒప్పందం ప్రకారం వెళ్లినా ఇబ్బంది పెట్టడానికి మేమేమీ దోపిడిదారులమో, హంతకులమో కాదు' అని కలైపులి.ఎస్.థాను వ్యాఖ్యానించారు.