Don't Miss!
- News TTD: శ్రీవారి దర్శనం , సేవలు, వసతి గదుల కోటా విడుదల...!!
- Sports వరల్డ్ కప్కు దూబె ఎంపికైనట్లే.. కానీ ఓ సమస్య- డివిలియర్స్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
వినూత్నమైన సబ్జెక్టుతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న పా రంజిత్
రజనీకాంత్తో 'కబాలి', 'కాలా' లాంటి చిత్రాలు తీసిన తమిళ దర్శకడు పా రంజిత్ త్వరలో బాలీవుడ్లోకి అడుగు పెట్టబోతున్నాడు. గిరిజన స్వాంతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా జీవితం ఆధారంగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.
పా రంజిత్ బాలీవుడ్ ఎంట్రీని ఖరారు చేస్తూ ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఈ చిత్రాన్ని నమా పిక్చర్స్ సంస్థ నిర్మించబోతోంది. ఈ సంస్థ గతంలో ఇషాన్ ఖట్టర్, మాళవిక మోహన్ నటించిన 'బియాండ్ ది క్లౌడ్స్' చిత్రాన్ని నిర్మించింది.
బిర్సా ముండా జీవితం ఆధారంగా తెరకెక్కబోయే ఈ చిత్రం ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉంది. నటీనటులు, టెక్నీషియన్స్ ఎంపిక సైతం జరుగాల్సి ఉంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది.
சாதிகளை துறந்து.... சித்தாந்தங்களை சுமந்து..!! நமது உரிமைகளுக்கான அம்புகளை எய்துவோம்.சகோதரரின் அடுத்த நகர்வு பழங்குடி புரட்சியாளன் #பிர்சாமுண்டாவின் வாழ்க்கை பதிவு! @beemji pic.twitter.com/3uGTdrwIEG
— PRO Kumaresan (@urkumaresanpro) November 14, 2018
మనకు అల్లూరి సీతారామరాజు ఎలాగో.... ఉత్తరాదిలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన వారిలో బిర్సా ముండా ఒకరు. జార్ఖండ్ ప్రాంతంలో 1980 కాలంలో ఆయన బ్రిటిష్ వారిపై పోరాటం చేసి చరిత్రకెక్కారు.
పా రంజిత్ రూపొందించిన 'కబాలి', 'కాలా' చిత్రాలు రికార్డు స్థాయి కలెక్షన్ సాధించింది. అతడి మేకింగ్ స్టైల్ సైతం సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా రజనీకాంత్ను తెరపై చూపించిన విధానం అభిమానులను ఎంతగానో మెప్పించింది.