Don't Miss!
- News సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులపై కీలక నిర్ణయం..!!
- Lifestyle ఈ రోజు రాశి ఫలాలు: ఓ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి..సమస్యలు పెరుగుతాయి
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
తని ఒరువన్ 2లో కాజల్ అగర్వాల్.. విలన్గా అరవింద స్వామికి ధీటైన నటుడు!
2016 విడుదలైన తని ఒరువన్ చిత్రం తమిళంలో అఖండ విజయం సాధించింది. ఈ పవర్ ఫుల్ పోలీస్ డ్రామాలో హీరోగా జయం రవి నటించాడు. జయం రవి సోదరుడు మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకుడు. తని ఒరువన్ చిత్రంలో అన్ని పాత్రలు బావుంటాయి. కానీ విలన్ పాత్ర మాత్రం సినిమాని మరో స్థాయికి తీసుకుని వెళ్ళింది. ఈ చిత్రంలో సీనియర్ హీరో అరవింద స్వామి విలన్ గా నటించాడు.
ఇటీవల ఈ చిత్రానికి సీక్వల్ చేయబోతున్నాం అంటూ మోహన్ రాజా ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు సన్నాహకాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. తని ఒరువన్ 2 లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొదటి భాగంలో నయనతార నటించింది. సీక్వెల్ లో మాత్రం కాజల్ అయితే బావుంటుందని దర్శకుడు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక విలన్ విషయంలో సంచలన రూమర్ ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక జరిగితే విడుదలకు ముందే సినిమాపై అమాంతం అంచనాలు పెరిగిపోతాయి. సీక్వెల్ లో కూడా విలన్ పాత్రని మోహన్ రాజా పవర్ ఫుల్ గా డిజైన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే మోహన్ రాజా మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టిని కలసి కథ వివరించాడట. మోహన్ రాజా మమ్ముట్టిని కలిసింది విలన్ పాత్ర కోసమే అని తమిళ సినీవర్గాల్లో చర్చ మొదలైంది.