Don't Miss!
- News డీజీ ఆంజనేయులు, సీపీ కాంతిరాణా టాటాపై ఈసీ బదిలీ వేటు: కీలక ఆదేశాలు
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
600 కోట్లతో సన్ గ్రూప్ భారీ బడ్జెట్ చిత్రాలు.. రజనీకాంత్, విజయ్, ధనుష్తో సినిమాలు
లాక్డౌన్ కాలంలో దేశవ్యాప్తంగా అన్ని రంగాలు కుదేల్ అయ్యాయి. ముఖ్యంగా సినిమా పరిశ్రమపై దారుణంగా ప్రభావం పడింది. అయితే కష్టాల్లో ఉన్న తమిళ పరిశ్రమను నిలబెట్టేందుకు ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సన్ గ్రూప్ 600 కోట్ల రూపాయలతో ఓ ప్లాన్ సిద్దం చేసింది. దాదాపు 400 కోట్ల రూపాయలను భారీ బడ్జెట్ ప్రాజెక్టుల కోసం కేటాయించినట్టు నిర్వాహకులు తెలిపారు.
మొత్తం 600 కోట్లలో మిగిలిన 200 కోట్ల రూపాయలను ఓటీటీ ద్వారా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. సన్ టీవీ, సన్ నెక్ట్స్ ఛానెల్స్ స్ట్రీమింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
దక్షిణాది భాషల్లో సన్ గ్రూప్ పలు భారీ ప్రాజెక్టులను ఇప్పటికే ప్రారంభించింది. రజనీకాంత్త అన్నాతే, విజయ్తో దళపతి65, ధనుష్తో డీ44, సూర్యతో ఆయన కెరీర్లో 40వ చిత్రాలను ఇప్పటికే ఓకే చేసింది. అలాగే విజయ్ సేతుపతి, శివకార్తికేయన్, ఇతర ప్రముఖ హీరోలు, హీరోయిన్లతో సినిమాలను రూపొందించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది.
సన్ నెట్ వర్క్ గ్రూప్ను ప్రముఖ వ్యాపారవేత్త కళానిధి మారన్ అధ్యర్యంలో కార్యకలాపాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.