Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'రోబో' నిర్మాతకి పోలీస్ సమన్లు
రోబో నిర్మాత, మీడియా మాగ్నట్ (సన్ నెట్ వర్క్ యజమాని)గా చెప్పబడే కళానిధి మారన్ పై పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేసి సమన్లు జారి చేసారు. సన్ పిక్చర్స్ పై పెట్టిన ఛీటింగ్ కేసుతో ఆయనకు ఇలా సమన్లు జారి చెయ్యాల్సి వచ్చిందని చెన్నై లోని కేకే నగర్ పోలీసులు చెప్తున్నారు. ఇక సేలంకి చెందిన ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ తమను ఎనభై మూడు లక్షలకు మోసం చేసారని అభియోగంతో పోలీస్ కేసు నమోదు చేసారు. అలాగే తాను ఆ డబ్బు అడిగినందకు తనను బెదిరిస్తున్నారని కూడా అందులో ఉంది. ఇక తీర్ద విట్టు పిళ్లై అనే చిత్రం కానూ ఈ బాకీ వచ్చిందని చెప్తున్నాడు. ఇక ఇప్పటికే సన్ పిక్చర్స్ కి చెందిన హన్సరాజ్ సక్సేనా ఈ కేసులో అరెస్ట్ అయ్యి ఉన్నారు. ఆయన కందన్ ఫిల్మ్ కు చెందిన కందన్ అనే వ్యక్తి పెట్టిన కంప్లైంట్ తో అరెస్టు చెయ్యబడి ఉన్నారు. ఇక ఈ రోజు ఏదో ఒక సమయంలో కళానిధి మారన్..కెకె నగర్ పోలీస్ స్టేషన్ కి వస్తారని అనుకుంటున్నారు. ఇక ఇప్పటికే దయానిధి మారన్..2జి స్కామ్ లో పీకలోతు ఇరుక్కని ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఎంతో లాభాలు ఆర్జించింది అని చెప్పుకున్న రోబో విషయంలోనూ ఎనిమిది కేసులు పెట్టబడటం విశేషం.ప్రస్తుతం సక్సెనా పదిహేను రోజులు జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు.