Don't Miss!
- News పవన్ కళ్యాణ్, చంద్రబాబుల కేసుల చిట్టా ఇదే!!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ఇంటిని స్వాధీనం చేసుకున్నా : కమల్
ఈ విషయమై కమల్హాసన్ మాట్లాడుతూ.. ఇంటిని తిరిగి స్వాధీనం చేసుకున్నా, జాతీయ బ్యాంకులో తిరిగి తాకట్టు పెట్టినట్లు తెలిపారు. విశ్వరూపం భారీ వసూళ్లే సాధించిందని, ఆ లాభాలు తనకు ఇంకా అందలేదని, అందిన వెంటనే బ్యాంకు నుంచి కూడా తన ఇంటిని స్వాధీనం చేసుకోనున్నట్లు పేర్కొన్నారు. విశ్వరూపం చిత్రం ద్వారా తాను పాఠం నేర్చుకున్నానని ఆయన వివరించారు.
వివాదాలతో మొదలైన 'విశ్వరూపం' భాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రంతో కమల్ తనకు సాటిలేదని మరోసారి ప్రూవ్ చేసి, రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇటీవలే రూ.100 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఆ మైలురాయిని దాటిందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తీవ్రవాదుల నేపథ్యంతో కమల్ ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన 'విశ్వరూపం' తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే.
న్యూజెర్సీలో జరిగిన కార్యక్రమంలో హీరోయిన్ పూజాకుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం 'విశ్వరూపం' రూ.200 కోట్లు దాటి వసూళ్లు రాబడుతోంది. చిత్ర యూనిట్ మొత్తం చాలా సంతోషంగా ఉన్నాం. 'విశ్వరూపం- 2' పనులు శరవేగంగా, జాగ్రత్తగా సాగుతున్నాయి. రెండు, మూడు నెలల్లో విడుదలవుతుందని చెప్పారు. ఈ చిత్రం తమిళనాట విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. మరోవైపు పైరసీ వెంటాడుతున్నా ప్రేక్షకులు థియేటర్వైపే మొగ్గు చూపుతున్నారు.