Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
దేశంలో తొలి టెర్రరిస్టు హిందువే.. కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు
విలక్షణ నటుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత తొలి టెర్రరిస్టు నాథురాం గాడ్సే అంటూ వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మహాత్ముడిని చంపిన నాథురాం గాడ్సేనే ముమ్మాటికి దేశానికి తొలి ఉగ్రవాది అని అన్నారు. దాంతో హిందూత్వవాద సంస్థలన్నీ కమల్ హాసన్ వ్యాఖ్యలపై దుమారం సృష్టించాయి.
తమిళనాడులోని అవరకురిచిలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. ఇది ముస్లీం ప్రభావిత ప్రాంతమని నేను మాట్లాడటం లేదు. గాంధీ విగ్రహం ముందు నిలబడి మాట్లాడుతున్నాను. స్వతంత్ర భారతంలో తొలి ఉగ్రవాది నాథురాం గాడ్సేనే అని అన్నారు.
తాను నిజమైన దేశ భక్తుడిని, జెండాను, మూడు రంగులను అమితంగా అభిమానించే భారతీయుడిని అని కమల్ అన్నారు. 2018లో రాజకీయ ప్రవేశం చేసిన కమల్ హాసన్ ఇప్పటి వరకు ఇంత తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగించలేదు. కాకపోతే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనేది తెలిసిందే.
గతంలో భారత, పాకిస్థాన్ రాజకీయవేత్తలు సరిగా వ్యవహరిస్తే ఏ ఒక్క సైనికుడు మరణించడు. నియంత్రణారేఖ మన అధీనంలో ఉంటుంది అని కమల్ వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారం రేగింది. ఆ తర్వాత రాజకీయ పక్షాలు విరుచుకుపడటంతో మళ్లీ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొన్నారు.