Don't Miss!
- News ఏపీలో ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..!!
- Finance Sensex News: 1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. దలాల్స్ట్రీట్ దున్నేస్తున్న బుల్స్..
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
సెన్సేషనల్ మూవీకి సీక్వెల్.. ఇండియన్ 2 ఎఫెక్ట్తో కమల్ సంచలన నిర్ణయం
ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న విలక్షణ నటుడు కమల్ హాసన్... తన తదుపరి చిత్రంపై దృష్టిపెట్టినట్టు కోలీవుడ్లో చర్చ జరుగుతున్నది. ఎన్నికల ఫలితాల తర్వాత తన కెరీర్లో మైలురాయిగా నిలిచిన క్షత్రియ పుత్రుడు సినిమాకు సీక్వెల్గా సినిమాను సెట్స్పైకి తీసుకెళ్లే ప్లాన్లో కమల్ ఉన్నట్టు సమాచారం.
ఇటీవల ప్రారంభమైన ఇండియన్ 2 సినిమా ఆర్థిక ఇబ్బందులతో ఆగిపోవడం తెలిసిందే. ఇండియన్ 2 సినిమా షూట్ నిరవధికంగా వాయిదా పడటంతో మరో సినిమా గురించి కమల్ నిర్ణయం తీసుకొన్నాడనే విషయం హాట్ టాపిక్గా మారింది.
ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తూనే క్షత్రియపుత్రుడు సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పనులను వేగవంతం చేశాడని, త్వరలోనే అధికారికంగా ఈ సినిమా గురించి ప్రకటన చేస్తారనే విషయం తమిళ మీడియా కథనాల్లో కనిపించింది. క్షత్రియ పుత్రుడు సినిమాను త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పొలాచిలో జరిగే సింగిల్ షెడ్యూల్లో షూట్ను ముగించేలా ప్లాన్ చేస్తున్నారు అని సినీ వర్గాలు వెల్లడించాయి.
షాకింగ్.. ప్రియుడితో శృతి హాసన్ బ్రేకప్.. మైఖెల్ కోర్సెల్ ఎమోషనల్గా!
క్షత్రియ పుత్రుడు సినిమా తమిళ భాషలో దేవర్ మగన్ పేరుతో 1992లో రిలీజైంది. ఈ చిత్రంలో కమల్ హాసన్, శివాజీ గణేసణ్, రేవతి, గౌతమి, నాజర్ తదితరులు నటించారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై రూపొందిన ఈ చిత్రానికి భరతన్ దర్శకుడు. ఇళయరాజా సంగీతం అందించిన పాటలు అత్యం ప్రజాదరణ పొందాయి.
ఇక సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇండియన్ 2 సినిమాను ఘనంగా ప్రారంభించారు. హీరోయిన్గా కాజల్ అగర్వాల్ను ఎంపిక చేశారు. అంతా సవ్యంగా జరుగుతున్నదనే సమయంలో సినిమాను వాయిదా వేయడం షాక్ గురి చేసింది. ఈ నేపథ్యంలో క్షత్రియ పుత్రుడు సినిమాను ఎన్నికల ఫలితాల తర్వాత సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలిసింది.