Don't Miss!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘విశ్వరూపం 2’ విడుదలకు లైన్ క్లియర్
కమల్ హాసన్ తాజా మూవీ 'విశ్వరూపం 2' ముందుగా అనుకున్న సమయానికే ఆగస్టు 10న విడుదలకు సిద్ధమవుతోంది. లీగల్ సమస్యలు, కరుణానిధి మరణం నేపథ్యంలో ఈ చిత్రం విడుదలపై నిన్నటి వరకు అనుమానపు మేఘాలు కమ్ముకున్నాయి.
కమల్ హాసన్ చెల్లించాల్సిన డబ్బు చెల్లించే వరకు ఆయన సినిమా ఆపాలని కొందరు కోర్టు కెక్కడం ఓ కారణమైతే, తమిళనాడులో మాజీ సీఎం కరుణానిధి మరణించిన నేపథ్యంలో సినిమా విడుదల ఉండక పోవచ్చనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే ప్రజల్లో నెలకొన్న ఈ అనుమానాలను క్లియర్ చేస్తూ కమల్ హాసన్ టీమ్ ప్రకటన చేసింది. ముందుగా అనుకున్న ప్రకారమే ఆగస్టు 10న సినిమా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలువుతుందని తెలిపారు.
కాగా... కమల్ హాసన్ తమకు ఇవ్వాల్సిన రూ. 7.75 కోట్లు చెల్లించే వరకు 'విశ్వరూపం 2' విడుదల ఆపాలని పిరమిడ్ సైమిరా ప్రొడక్షన్స్ వేసిన పిటీషన్ను మద్రాస్ హైకోర్ట్ రిజక్ట్ చేసింది. దీంతో సినిమాకు విడుదలకు లైన్ క్లియర్ అయినట్లయింది.