Don't Miss!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- News SRH Vs RCB మ్యాచ్: ఉప్పల్ మార్గంలో అర్ధరాత్రి వరకు మెట్రో, ఆర్టీసీ సేవలు
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
కమల్ 'ఉత్తమ విలన్' ఫస్ట్లుక్ ఇదే
చెన్నై: ప్రముఖ నటుడు కమల్హాసన్ హీరోగా రమేష్ అరవింద్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఉత్తమ విలన్'. లింగుస్వామి సారథ్యంలోని తిరుపతి బ్రదర్స్ నిర్మిస్తున్నారు. రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ సమర్పకులు. తమిళంతోపాటు పలు దక్షిణాది భాషల్లో ఈ చిత్రం నిర్మితమవుతోంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే కమల్ హాసనే సమకూర్చారు. తమిళ వెర్షన్కు సంబంధించిన ఫస్ట్లుక్ చైన్నైలో విడుదల చేశారు. తమిళ సంస్కృతికి అద్దంపట్టే 'విల్లుపాట్టు' (విల్లుపాట) పరికరం ఆకారంతో చిత్రం శీర్షికను రూపొందించారు.
ఇందులో కమల్కు ముగ్గురు హీరోయిన్లు ఉండేలా కథను సిద్ధం చేసుకున్నారు. త్రిష, తమన్నా, కాజల్ను ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి. 'దృశ్యం' రీమేక్లో కమల్హాసన్ సరసన నటించేందుకు నదియా, సిమ్రాన్ల మధ్య పోటీ నెలకొందన్న వార్తల నేపథ్యంలో ఆయన మరో కొత్త చిత్రంలో త్రిష, తమన్నా, కాజల్ జోడీ కట్టనున్నారనే వార్త హాట్ టాపిక్గా మారింది.
వీరిలో త్రిష ఇప్పటికే కమల్తో 'మన్మథన్ అంబు'లో నటించగా, మిగతా ఇద్దరు మొదటిసారి ఆయనతో కలిసి పనిచేయనున్నారు. ఇందులో తనతో పాటు తన గురువు కె.బాలచందర్ కూడా నటిస్తున్నారని, చిత్రంలోని పాత్రకోసం గడ్డం కూడా పెంచుతున్నానని కమల్హాసన్ పేర్కొన్నారు. కమల్తో కలిసి దక్షిణాదికే చెందిన మరో నలుగురు అగ్ర హీరోలు కూడా ఇందులో కనిపించనున్నారని సమాచారం. వారిలో ఒకరిగా మమ్ముటిని ఎంపిక చేశారు. ఇది పూర్తి హాస్యభరిత కథా చిత్రమని సమాచారం.
ఈ తరహా చిత్రాలకు సంభాషణలు రాయడంలో రచయిత క్రేజి మోహన్ పేరు గడించారు. ఉత్తమ విలన్ చిత్రానికీ ఆయనే మాటలు రాస్తున్నారు. హాస్యపాత్రలో వివేక్ నటించనున్నారు. ప్రస్తుతం కమలహాసన్ విశ్వరూపం-2 చిత్ర రిలీజ్ హడావిడిలో బిజీగా ఉన్నారు. ఉత్తమ విలన్ తెరకెక్కనుంది. 'పంచతంత్రం'లో కమల్తోపాటు ఓ ముఖ్య పాత్ర పోషించారు రమేష్.
రమేష్ అరవింద్ మాట్లాడుతూ.. '' నేను, కమల్ మంచి స్నేహితులు. కన్నడలో నేను తెరకెక్కించిన 'రామా శ్యామా భామా'లో కమల్ ముఖ్యపాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన 'విశ్వరూపం 2' చిత్రీకరణ పూర్తి చేశారు. నేను కూడా కన్నడ సినిమాలను ఒప్పుకోలేదు. కమల్తో 'ఉత్తమ విల్లన్' తెరకెక్కించే పనుల్లో ఉన్నా. దీని స్క్రిప్ట్ను కమలే రాశారు. పలు సినిమాలలో ఆయనతో కలసి నటించిన అనుభవం ఉంది. మా అభిప్రాయాలను బాహాటంగా చర్చించుకుంటాం. మంచి స్నేహితుడు కావడంవల్ల అడ్వాంటేజ్ తీసుకోగలుగుతున్నాను''అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: గిబ్రా, సినిమాటోగ్రఫీ: శ్యామ్ దత్, ఎడిటింగ్: విజయ్శంకర్.