Don't Miss!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- News చిలుకూరు బాలాజీ ఆలయానికి గరుడ ప్రసాదం కోసం భక్తుల రష్.. అసలేమిటీ గరుడ ప్రసాదం?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
కమల్ హాసన్ పాట పాడుతున్నాడు
చెన్నై: హీరోలు అంతా ఇప్పుడు పాటలు పాడుతున్నారు. అదే రూటులో కమల్ హాసన్ సైతం పాట పాడటానికి సిద్దమవుతున్నారు. అయితే ఆయన పాడే పాట ఆయన నటిస్తున్న చిత్రం కోసం కాదు. వీజే ప్రొడక్షన్స్ బ్యానరుపై నూతన దర్శకుడు విజయ్ తెరకెక్కిస్తున్న చిత్రం 'అవం' కోసం కావటం విశేషం.
ఈ చిత్రానికి చంద్రమూర్తి సంగీతం సమకూర్చుతున్నారు. ఈ సినిమాలో హీరో ఒంటరితనం, ఆవేదనను చాటే ఓ గీతాన్ని ఆలపించే వారికోసం చిత్ర యూనిట్ వెతికింది. ఎంతో మందిని పరిశీలించాక.. 'విశ్వనటుడు' కమల్హాసన్ న్యాయం చేయలగలరని భావించింది.
ప్రముఖ గేయ రచయిత వైరముత్తు కుమారుడు మదన్కార్కి రాసిన ఆ పాటను పాడమని కమల్ను ఇటీవల దర్శకుడు కోరారు. చిత్ర ప్రాధాన్యతను గుర్తించిన ఆయన వెంటనే ఒప్పుకున్నారు. ఇందులో గౌరవ్ హీరోగా నటించారు. కావ్యాశెట్టి కథానాయిక. 'రాజా రాణి' ఫేం గుహన్ ఎస్.పళని సినిమాటోగ్రఫీ చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ.. ''కమల్ పాడితేనే ఆ గీతం బాగుంటుందని అనుకున్నాం. మా కోరికను మన్నించి ఆయన పాడారు. చాలా అద్భుతంగా వచ్చింది. ఈ పాట అందర్నీ హత్తుకునేలా ఉంటుంది''అని చెప్పారు.