Don't Miss!
- News రామేశ్వరం కేఫ్ కేసులో ట్విస్ట్, క్లాస్ మేట్ కోసం ఏం చేశాడంటే?, బాంబర్ తో అన్ని నెలలు!
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
ఘనంగా దర్శకుడు వివాహం..కమల్ హాసన్ హాజరు
చెన్నై: ప్రముఖ సినీ నిర్మాత ఏఎమ్ రత్నం కుమారుడు, సినీ దర్శకుడు జ్యోతికృష్ణ వివాహం చెన్నైలో ఘనంగా జరిగింది. శ్రీ సూర్య మూవీస్ పతాకంపై పలు హిట్ చిత్రాలు నిర్మించిన జ్యోతికృష్ణ తెలుగులో 'నీ మనసు నాకు తెలుసు', తమిళంలో 'కేడి', 'వూ లలలా..' తెరకెక్కించారు. ఐశ్వర్యతో ఆయన వివాహం చెన్నైలో శుక్రవారం జరిగింది. విశ్వనటుడు కమల్ హాసన్, దర్శకులు శంకర్, విష్ణువర్ధన్, నటుడు రాంకీ, గాయకుడు హరిహరన్ తదితరులు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు అందజేశారు.
ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఏఎం రత్నం పెద్ద కొడుకు యువ దర్శకుడు, నటుడు జ్యోతికృష్ణ వివాహం శుక్రవారం చెన్నైలో వైభవంగా జరిగింది. ఇండియన్ బాయ్స్, తెలుగులో స్నేహం కోసం వంటి పలు సూపర్హిట్ చిత్రాలను నిర్మించిన ఏఎం రత్నం పెద్దరికం, సంకల్పం తదితర హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈయన పెద్ద కొడుకు జ్యోతికృష్ణ నాకు 20 నీకు 18, కేడి తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఊలలల్లా చిత్రంలో హీరోగా నటించి దర్శకత్వం వహించారు.
జ్యోతికృష్ణకు, చెన్నైకి చెందిన శివగురునాథన్ తులసి దంపతుల కుమార్తె ఐశ్వర్యతో వివాహ నిశ్చయం అయ్యింది. వీరి వివాహం గురువారం చెన్నైలో సంప్రదాయబద్దంగా జరిగింది. వివాహ కార్యక్రమానికి ఇరువర్గాల బంధుమిత్రులతో పాటు పలువురు చిత్ర ప్రముఖులు విచ్చేసి నవ వధువరూలను ఆశీర్వదించారు. సినీ ప్రముఖులు నటుడు కమల్హాసన్, దర్శకుడు శంకర్ దంపతులు, గాయకుడు హరిహరన్, కళగు కృష్ణ తదితరులు హాజరయ్యారు. వివాహ రిసెప్షన్ 26వ తేదీన సాయంత్రం అడయార్, ఎంఆర్సీ నగర్లోని ది లీలా ప్యాలెస్లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ఉత్తర, దక్షిణాదికి చెందిన పలువురు చిత్ర ప్రముఖులు హాజరుకానున్నారు.