శ్రుతి కోసం కలం పట్టిన కమల్హాసన్
చెన్నై : కమల్హాసన్ తాజాగా తన కుమార్తె శ్రుతి కోసం ఓ పాట కూడా రాశారట. హీరోయిన్గా రాణిస్తున్న శ్రుతిహాసన్ తనకు ఎంతో ఇష్టమైన సంగీతంలో కూడా కొనసాగుతున్నారు. ప్రస్తుతం అస్సోంకు చెందిన జోయ్ పరువా అనే సంగీత కళాకారుడితో కలిసి ఓ ఆల్బమ్ను రూపొందిస్తోంది. ఒరియా, తమిళ భాషల్లో దీన్ని తీసుకొస్తున్నారు.
తమిళంలో దీనికోసం తన తండ్రితో ఒక్క పాటైనా రాయించాలని నిశ్చయించకున్న శ్రుతి... కమల్కు తన కోరిక వినిపించదట. 'విశ్వరూపం-2' నిర్మాణాంతర పనులు, 'ఉత్తమ విలన్' షూటింగ్, 'దృశ్యమ్' రీమేక్ సన్నాహాల్లో బిజీగా ఉన్నప్పటికీ కుమార్తె కోరిక మేరకు కమల్ ఓ పాట రాసి ఆమె చేతిలో పెట్టారట. ఎంతైనా తండ్రి ప్రేమ కదా అంటున్నారు తమిళ సినీ వర్గాలు.

ఇక రీసెంట్ గా శ్రుతి హాసన్ మళ్లీ గొంతు సవరించుకుంది. అల్లు అర్జున్ తో ఆమె చేస్తున్న 'రేసుగుర్రం' లో ఆమె ఓ పాట పాడింది. ఇందులో 'డౌన్ డౌన్ డుప్పా..' అంటూ సాగే ఓ గీతాన్ని శ్రుతిహాసన్ ఆలపించింది. ఈ పాటకి అల్లు అర్జున్తోపాటు ఆమె కూడా డ్యాన్స్ చేసింది. ఈ పాటని రామోజీఫిల్మ్సిటీలో చిత్రీకరించారు. బాలీవుడ్ నృత్య దర్శకుడు ఫిరోజ్ఖాన్ నృత్యరీతులు సమకూర్చారు.
గబ్బర్ సింగ్, బలుపు చిత్రాలతో ఫామ్ లోకి వచ్చిన శ్రుతి ..అటు హీరోయిన్ గా...అదరకొడుతూనే మరో ప్రక్క పాటలు పాడే కార్యక్రమం కూడా పెట్టుకుంది. తాజాగా ఆమె తమిళంలో ఓ పాట పాడింది. తెలుగులో హిట్టైన అలా మొదలైంది చిత్రం రీమేక్ గా రూపొందుతున్న చిత్రంలో ఆమె చేత ఓ పాటను పాడించారు. షటప్ యువర్ మౌత్ అంటూ సాగే ఈ పాట బాగా వచ్చిందని, అది హిట్టై ఆమెను అందరూ తమి సినిమాల్లో ఒక పాటపాడమని అడుగుతారని దర్శకుడు చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











