For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నలుగురు రతీదేవిలతో ఇద్దరు చిలిపి మన్మథులు...?
Tamil
oi-Saraswathi N
By Sindhu
|
ఇప్పటికీ మన్మథుడు ఎవరంటే కమల్ హాసన్ పేరే ముక్తకంఠంతో చెబుతారు. దానికి తగ్గట్టుగా త్వరలో కమల్ నటించే మన్మథన్ అంబు చిత్రం విడుదల కాబోతోంది. లాగే తెలుగు సినీ ఫీల్డ్ కు సంబంధించి అమ్మాయిల కలల రాకుమారుడు..మన్మథుడు ఎవరని అడిగితే అక్కినేని నాగార్జున అని అంటారంతా. అందుకే నాగార్జునతో మన్మథుడు అనే పేరుతో ఓ చిత్రం రూపొంది ఘన విజయం కూడా సాధించింది.
విషయం ఏమిటంటే వీళ్లిద్దరూ నటించిన చిత్రాలు మన్మథబాణం, రగడ ఒక రోజు తేడాలతో విడుదల కానున్నాయి. ఇక ఈ మన్మథులకు జోడీగా కమల్ హాసన్ తో మన్మథబాణం చిత్రంలో త్రిష జతకడుతోంది. నాగార్జున హీరోగా వస్తున్న రగడ చిత్రంలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. అనుష్క ప్రధాన హీరోయిన్ కాగా ప్రియమణి, ఛార్మి నాగార్జునతో చిందెయ్యబోతున్నారు. ఇలా ఇద్దరు మన్మథులతో నలుగురు రతీదేవిలు ఈ వారం వెండితెరపై కనువిందు చేయనున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: కమల్ హాసన్ నాగార్జున త్రిష ప్రియమణి అనుష్క kamal hassan nagarjuna trisha priyamani anushka
Story first published: Tuesday, December 21, 2010, 16:12 [IST]
Other articles published on Dec 21, 2010