twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమ్మా.. నాన్న గుర్తుకొచ్చారు: కమల్‌హాసన్‌

    By Srikanya
    |

    చెన్నై : 'పద్మభూషణ్‌' పురస్కారం తనకు మరింత క్రమశిక్షణను నేర్పుతోందని విశ్వనటుడు కమల్‌హాసన్‌ తెలిపారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్‌ అందుకున్నారు కమల్‌హాసన్‌. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పురస్కారం నన్ను గౌరవప్రదం చేయడంతోపాటు.. నా సొంతగడ్డకు మరింత పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతోంది. ఓ భారతీయుడిగా నా బాధ్యతను నెరవేర్చే అవార్డుగా దీన్ని పరిగణిస్తున్నాను.

    రాష్ట్రపతి భవన్‌లో జాతీయగీతం పాడుతుంటే.. గతంలోకన్నా భిన్నంగా కొత్తరకమైన అనుభూతికి లోనయ్యా. ఆ సమయంలో దేశభక్తిగల నా తల్లిదండ్రులు గుర్తుకొచ్చారు. క్రికెట్‌లో భారతజట్టు గెలిస్తే గర్వించేలా.. నా దేశం ఏ రంగంలో రాణించినా మరింత గర్వంగా భావిస్తున్నాను. నేనో మహావృక్షపు విత్తనమనే విషయాన్ని ఈ పురస్కారం గుర్తుచేస్తోంది. నాలో క్రమశిక్షణను మరింతగా పెంచుతోంది. ఈ పురస్కారం నేను ఇంకా ఏదో సాధించాలన్న తపనను కూడా పెంచిందని చెప్పుకొచ్చారు.

    రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా న్యూఢిల్లీలో కమల్‌హాసన్‌ పద్మభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్నారు. నటుడు కమల్‌హాసన్‌, బ్యాడ్మింటన్‌ ఆటగాడు పి.గోపీచంద్‌ సహా 12 మందికి పద్మ భూషణ్‌ పురస్కారాలు అందజేశారు. నటి విద్యాబాలన్‌, భారత మహిళల కబడ్డీ జట్టు కోచ్‌ సునీల్‌ దబాస్‌, ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయిక్‌, సామాజిక కార్యకర్త జవహర్‌ లాల్‌ కౌల్‌ సహా 53 మందికి పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు.

    Kamal Hassan

    ఇక కమల్ హసన్ నటిస్తూ, రూపొందిస్తున్న చిత్రం 'విశ్వరూపం 2'. ఈ చిత్రం మే 2 లేదా మే 9 న విడుదల చేయాలని దర్శక,నిర్మాతలు ఖరారు చేసారని కోలీవుడ్ సమాచారం. గత ఏడాది 'విశ్వరూపం'తో ఘన విజయాన్ని అందుకున్నారు కమల్‌. వివాదాలే కాదు... చక్కని విజయంతోనూ ఈ చిత్రం వార్తల్లో నిలిచింది. దీనికి సీక్వెల్‌గా 'విశ్వరూపం-2'ను తన దర్శకత్వంలోనే మొదలుపెట్టారు కమల్‌.

    విశ్వరూపం చిత్రం భారీ విజయం సాధించడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి. 'విశ్వరూపం' చిత్రం పలు వివాదాలకు కేంద్రబిందువైంది. అయితే దర్శకుడిగా కమల్‌ ప్రతిభ విమర్శకుల్ని మెప్పించింది. విశ్వరూపం'-2 చిత్రాన్ని ఆస్కార్‌ వి.రవిచంద్రన్‌ నిర్మిస్తున్నారు. రెండో భాగంలోనూ అంతర్జాతీయ ఉగ్రవాదం ప్రస్తావన ఉంటుంది. దాంతోపాటు తల్లీబిడ్డల అనుబంధాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇందులో యుద్ధ ఘట్టాలు ఉత్కంఠను రేకెత్తిస్తాయని సమాచారం.

    ఇక 'విశ్వరూపం'లో చూపించలేకపోయిన కొన్ని సన్నివేశాలను సీక్వెల్ లో చూడొచ్చని కమల్‌హాసన్‌ తెలిపారు. ఇందులో యుద్ధ సన్నివేశాలు మరింత బ్రహ్మాండంగా ఉంటాయి. తొలి భాగంలో చూపించలేకపోయిన ప్రేమ, రొమాన్స్‌ సన్నివేశాలే కాక తల్లీకొడుకు మధ్య ఉండే అప్యాయత, అనురాగాలను కూడా కొనసాగింపులో చూపనున్నట్లు ఆయన వివరించారు.

    కమల్ మాట్లాడుతూ ''వివాదాల అవరోధాలను దాటుకుని విడుదలైంది. తొలి భాగంలో కొన్ని అంశాలు చూపించలేకపోయాను. ప్రేమ ఘట్టాలు లేవు. అలాగే తల్లీకొడుకుల మధ్య ఉండే ఆప్యాయతానురాగాలు లేవు. వాటన్నింటికి 'విశ్వరూపం 2'లో స్థానం ఉంది. ఇందులో యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.'' అన్నారు.

    విశ్వరూపం చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిస్తున్న స్పై థ్రిల్లర్ చిత్రంలో మేజర్ వసీం ఆహ్మద కశ్మీరి పాత్రను కమల్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ తల్లి పాత్రను బాలీవుడ్ నటి వహిదా రహ్మన్ పోషిస్తుండగా, రాహుల్ బోస్, పూజా కుమార్, శేఖర్ కపూర్, ఆండ్రియా జెర్మియాలు నటిస్తున్నారు.

    English summary
    Kamal Haasan, who had last year threatened to leave India in the light of controversies surrounding his film 'Vishwaroopam,' today pledged his "commitment" to the country and expressed hope he would not leave it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X